Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నందిగ్రామ్ నుంచి బరిలో సీఎం మమతా
- సినీ, స్పోర్ట్స్, కళాకారులకు పెద్ద ఎత్తున అవకాశం
- 80 ఏండ్లు దాటినివారికి సీట్లు ఇవ్వని తణమూల్
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
దేశవ్యాప్తంగా ఆసక్తిరేకెత్తిస్తోన్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల జాబితాపై కీలక ఘట్టం ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కూటమికి ముందుగానే టీఎంసీ చైర్మన్, సీఎం మమతా బెనర్జీ(దీదీ) తమ అభ్యర్థుల తొలి లిస్టును విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆమె టీఎంసీ అభ్యర్థుల జాబితాని ప్రకటించింది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న బెంగాల్ లో 291 మంది క్యాండిడేట్ల పేర్లను ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేసింది. అంతకు ముందు మమతా నివాసంలో టీఎంసీ ఎలక్షన్స్ ప్యానల్ మీటింగ్ జరిగింది. అనంతరం ఆమె అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తనపై నమ్మకం ఉంచాలని, టీఎంసీ మాత్రమే బెంగాల్ అభివద్ధిలో బాటలో నడపగలదన్నారు. ఈ కీలకమైన ఎన్నికల్లో కళలు, క్రీడలు, మీడియా, సంస్కతి రంగాలకు చెందిన ప్రముఖులకు అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చాన్నారు. అలాగే, 80 ఏండ్ల పైబడిన నేతలను ఈసారి పక్కన పెట్టినట్టు చెప్పారు. దీంతో దాదాపు 24 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు డ్రాప్ అయ్యారన్నారు. గతంలో ప్రకటించినట్టు తాను నందిగ్రామ్ నుంచి బరిలో దిగనున్నట్టు చెప్పారు. మార్చి 9 న నందిగ్రామ్ వెళ్తానని వెల్లడించారు. మార్చిన 10 న కార్యకర్తలతో కలిసి హల్దియాలో నామినేషన్ ఫైల్ చేయనున్నట్టు స్పష్టం చేశారు. కాగా, ఈ ఏడాది జనవరిలో నందిగ్రామ్ నుంచే తాను ఎన్నికల బరిలో దిగనున్నట్టు చెప్పారు. ''నందిగ్రామ్ లక్కీ సీట్. నందిగ్రామ్ పెద్ద అక్క, భవానిపోర్ చిన్న చెల్లి అంటూ''వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె రెండు చోట్ల నుంచి ఎన్నికల్లో పోటి చేస్తారన్న వార్తలు వినిపించాయి.కాగా, టీఎంసీ వెన్నుదన్నుగా, మమతాకు రైట్ హ్యాండ్ గా పేరున్న సువేంద్ అధికారిపై పోటీకి దీదీ సై అని ప్రకటించింది. మమతా క్యాబినేట్ లో మంత్రిగా ఉన్న సువేందర్ కొద్ది రోజుల క్రితమే బిజేపిలో చేరారు. ప్రస్తుతం నందిగ్రామ్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. సిఎం మమతా ఇక్కడి నుంచే బరిలో దిగడంతో ఈ సీట్ హాట్ పాయింట్ గా మారనుంది. మరోవైపు ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న భవానిపోర్ నుంచి పవర్ మినిస్టర్ సోవన్ డేబ్ చటోపాధ్యాయను బరిలో నిలిపారు.