Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
  • మూడో రోజు వైఎస్ షర్మిల దీక్ష
  • నిజామాబాద్‌లో కోవిడ్ మృతదేహాలు తారుమారు
  • రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
  • రేపు నగరంలో వ్యాపార సంస్థల మూసివేత
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
అన్నదాతకు అండగా... | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

అన్నదాతకు అండగా...

Sat 06 Mar 02:41:50.037447 2021

- నిరసనల్లో రైతులు... పంటలను కాపాడుతున్న గ్రామస్థులు
- పంజాబ్‌లో ప్రతి గ్రామంలోనూ ఇదే తీరు
చండీగఢ్‌ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలు కొనసాగిస్తున్న అన్నదాతలకు వారి గ్రామాలకు చెందిన ప్రజలు బాసటగా నిలుస్తున్నారు. పంటలు వేసి దీక్షల్లో పాల్గొనడానికి ఢిల్లీ సరిహద్దులకు వచ్చి అన్నదాతలు ఆందోళనలు కొనసాగిస్తుంటే.. ఊరిలోని ప్రజలు ఆ రైతులు వేసిన పంటకు రక్షణగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. వివాదాస్పద చట్టాలు రద్దయ్యేంతవరకు పోరాడతామన్న రైతన్నలకు పంజాబ్‌లోని ప్రతి గ్రామంలోని ప్రజలు ఈ విధంగా మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు.
జగ్‌సీర్‌ సింగ్‌ చిన్నివాల్‌ అనే ఓ రైతు సంఘం నాయకుడు గతేడాది నవంబర్‌ 26 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో నూతన చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు. అయితే, బర్నాలలోని చిన్నివాల్‌ గ్రామ ప్రజలు ఆయన పంటపొలాలను ఏ మాత్రం నష్టం కాకుండా చూసుకున్నారు. '' నేను ఢిల్లీ సరిహద్దుకు వచ్చే ముందు గోధుమ పంటను వేశాను. పంటను గ్రామస్థులు చక్కగా చూసుకున్నారు. ప్రతిరోజూ పంటకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను వారు నాకు పంపేవారు. అయితే, పంటకోతకు సమయం వచ్చింది. అయినా ఈ విషయంలో నాకు ఏ మాత్రం బాధ లేదు. ఎందుకంటే వారు (గ్రామస్థులు) పంటకోతను చక్కగా నిర్వహించగలుగుతారు'' అని జగ్‌సీర్‌ సింగ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. '' ప్రతివారం, మా గ్రామం నుంచి 17-18 మంది నిరసల్లో పాల్గొనడానికి ఢిల్లీ సరిహద్దుకు వెళ్తారు. పంటకోత అనే ప్రక్రియ రెండు నుంచి మూడువారాలకు సంబంధించింది. కాబట్టి, ఒకరి భారాన్ని మరొకరం మేము సులువుగా నిర్వహించగలం. అంతేకాదు, ఏ ఒక్కరికి నష్టం చేకూరకుండా 15-20 మంది సభ్యులుండే మా గ్రామ కమిటీ కూడా గ్రామంలో ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తుంది'' అని ఆయన వివరించారు.
ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలు కొనసాగిస్తూ గ్రామాల్లో పంటకోత, కోనుగోలుకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి అంతరాయాలు ఏర్పడకుండా చేపట్టాల్సిన చర్యలపై టిక్రీ సరిహద్దు వద్ద రైతులతో ఇప్పటికే చర్చించినట్టు బీకేయూ డకౌండ ఉపాధ్యక్షుడు మన్‌జీత్‌ ధనర్‌ తెలిపారు. ఈనెల 8న నిరసన వేదిక వద్దకు మహిళలు పెద్ద సంఖ్యలో వస్తారని చెప్పారు. అయితే, పాల సేకరణ, పంట సేకరణ, నిల్వ, కొనుగోలు, వ్యవసాయ కార్మికులకు సంబంధించిన విషయాలు చూసుకోవాల్సిన అవసరం ఉన్నందున ఈనెల 8 తర్వాత నుంచి మహిళల సంఖ్య పరిమితంగానే ఉంటుందని వివరించారు. ఇదే విధంగా, పలు మండలాలు, గ్రామాలకు చెందిన రైతులు కూడా పంటకోత సమయంలో వ్యవహరించాల్సిన తీరుపై, తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే కమిటీలు ఏర్పాటు చేసి ముందుకు సాగుతున్నారు. ఐక్యంగా ఉంటేనే ఇటు పంటకోత పనులతో పాటు అటు నిరసనలను కూడా కొనసాగించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురాగలమని రైతన్నలు తెలిపారు. పంజాబ్‌ వ్యవసాయ విభాగం సమాచారం ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35.05 లక్షల హెక్టార్లలో రైతులు గోధుమ పంటను వేశారు. ఏప్రిల్‌ నెలలో ఈ పంట కోతలు జరగనున్నాయి.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కరెన్సీ ముద్రణ నిలిపివేత
డేంజర్‌ బెల్స్‌..
వినూత్నరీతిలో రైతుల నిరసన
గాలి ద్వారా కరోనా
ఈ ఏడాది సాధారణ వర్షపాతం
కేసులు దాస్తున్నారు..
మృత్యుఒడిలో భారతం
పరీక్షలకు 'పరీక్ష'
దాడులు చేస్తే ఖబడ్దార్‌...
50 వేల మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ దిగుమతి
నిరుద్యోగ తాండవం..
టోకు ధరల దెబ్బ
రైతుల గుడారాలకు నిప్పు
ఆర్థికం.. అధోగతి
బ్యాంకుల ప్రయివేటీకరణకు బిల్లు..!
కరోనా@2,00,000
తక్షణ చర్యలు చేపట్టండి : సీపీఐ(ఎం) డిమాండ్‌
ఢిల్లీలో మరణ మృదంగం..
14 ఏండ్ల బాలికపై... 12 మంది రెండేండ్లకు పైగా అఘాయిత్యం
గగన్‌ యాన్‌ మిషన్‌లో సహకారానికి భారత్‌-ఫ్రాన్స్‌ ఒప్పందం
18, 19 తేదీల్లో ఆంధ్రాలో ఎస్‌కేఎం నేతల పర్యటన
విద్యుత్‌ సంస్థల ప్రయివేటీకరణ నిలిపేయాలి
బీజేపీ, టీఎంసీ రెండు సిద్ధాంతాలూ ఒకటే
గత రెండు దశాబ్దాలలో మరుపురాని ఆస్కార్‌ క్షణాలు
కేరళలో భారీ వర్షాలు
సీబీఎస్‌ఈ టెన్త్‌ పరీక్షలు రద్దు
రాజ్యాంగాన్ని పరిరక్షిద్దాం
21న ఢిల్లీ మార్చ్‌
ఒక్కరోజే 10270 మరణాలు 1.84 లక్షల కేసులు
నితిన్‌ గడ్కరీకి ఆ ముడుపులు నిజమే
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.