Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టేషన్లలో జనం రద్దీని తగ్గించేందుకే..: రైల్వే శాఖ
న్యూఢిల్లీ : దేశంలో రైల్వేప్లాట్ఫాం టికెట్ ధరలు పెరిగాయి. ఇప్పటి వరకు రూ. 10గా ఉన్న టికెట్ ధరను ఏకంగా రూ. 30కి పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ను విడుదల చేసింది. పెంచిన ధరలు శుక్రవారం నుంచే అమలు చేయాలని దేశంలోని అన్ని జోన్లకు రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనితో పాటు లోకల్ ట్రైన్లలో కూడా టికెట్ ధరలు పెరిగాయి. అయితే, దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో జనం రద్దీని తగ్గించి ప్రయాణికుల భద్రతలో భాగంగానే ప్లాట్ఫాం టికెట్ ధరలను పెంచినట్టు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఈ పెంచిన ధరలు తాత్కాలికమేనని వివరించింది.