Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉక్కు ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ మహాప్రదర్శనలు
- మోడీకి వ్యతిరేకంగా ప్లకార్డులతో..బ్యానర్లతో నినాదాల హౌరు
- బీజేపీ మినహా పార్టీలకతీతంగా ఉద్యమం...స్తంభించిన జనజీవనం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో 'ఉక్కు' సంకల్పంతో బంద్ పాటించారు. మోడీ సర్కార్ తీసుకున్న స్టీల్ప్లాంటు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా 'విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి' ఇచ్చిన పిలుపు మేరకు ఏపీ అంతా స్తంభించింది. బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం బంద్కు సహకరించాయి. 'విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు' అని నినదించాయి. విద్యా, వాణిజ్య సంస్థల నిర్వాహకులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయివేటు వాహనాలు రోడ్లపైకి వచ్చినా.. ఆందోళనకారులు అడ్డుకున్నారు.దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణను నిరసిస్తూ జరుగుతున్న బంద్ కు ఏపీ రాజధాని అమరావతి రైతులు మద్దతు తెలిపారు. రాజధాని గ్రామాల్లో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. ఆంధ్రులు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కుని ప్రయివేటీకరిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. బంద్ లో భాగంగా రాజకీయ పక్షాలు, రైతులు మందడంలో రోడ్డుపై బైటాయించారు. సచివాలయానికి వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు.. పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.