Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసోం అసెంబ్లీ ఎన్నికలు
గౌహతి : త్వరలో జరిగే అసోం అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక, భాగస్వామ్య పార్టీలకు సీట్లు సర్దుబాటు చేయడంపై కాంగ్రెస్కు కష్టాలు ప్రారంభమయ్యాయి. అభ్యర్థుల ఎంపిక ఇంకా జరగకుండానే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై తనను సంప్రదించడం లేదని, కనీసం అందుకు సంబంధించిన సమావేశాలకు కూడా తనకు ఆహ్వానం లేదని అమె అసంతృప్తి వ్యక్తం చేశారు. బెంగాలీలు అధిక సంఖ్యలో ఉన్న బారక్ వ్యాలీలోని సోనాయి అసెంబ్లీ స్థానాన్ని ఎఐయుడిఎఫ్కు కాంగ్రెస్ కేటాయించడంపై దేవ్ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. అలాగే బారఖోలా, దలై స్థానాలకు తాను సూచించిన అభ్యర్థులను పార్టీ పరిగణనలోకి తీసుకోవడం లేదని కూడా మాజీ ఎంపీ సుస్మితా దేవ్ ఆగ్రహంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలో ఎఐయుడిఎఫ్, సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ (ఎంఎల్) వంటి ఎనిమిది పార్టీలు మహాకూటమి పేరుతో పోటీ చేయనున్నాయి.
కాగా, అస్సాం ఎన్నికలకు 70 మంది అభ్యర్ధులతో బిజెపి తొలి జాబితా విడుదల చేసింది. ఎజిపి, యుపిపిఎల్తో కలిసి బిజెపి బరిలో ఉంది.