Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం ఏఐఏడీఎంకే, బీజేపీ మధ్య సీట్ల పంపిణీ ఖరారయింది. బీజేపీకి 20 ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఉప ఎన్నిక జరగనున్న కన్యాకుమారి లోక్సభ స్థానాన్ని ఏఐఏడీఎంకే కేటాయించింది. నటుడు విజయకాంత్ డీఎండీకే పార్టీకి ఎఐఎడిఎంకె ఇంకా సీట్లు సర్దుబాటు చేయాల్సి ఉంది. కాగా, శుక్రవారం 6 మంది అభ్యర్థులతో ఏఐఏడీఎంకే తొలి జాబితాను ప్రకటించింది. సీఎం పళనిస్వామి ఈడప్పడి నియోజకవర్గం నుంచి, పన్నీర్సెల్వం బోడినయకనూర్ నుంచి పోటీ చేయనున్నారు. మరోవైపు కన్యాకుమారి లోక్సభ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం విజ్ఞప్తి చేశారు.