Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉక్కు సత్యాగ్రహి అమృతరావు మనవడు గాంధీ
విశాఖ: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భవిష్యత్తు తరాల కోసం పోరాడాలని ఉక్కు సత్యాగ్రహి అమృతరావు మనవడు గాంధీ పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సాధనకు అమృతరావు అప్పట్లో నిరాహార దీక్ష చేశారు. కేంద్ర ప్రభుత్వ హామీతో అప్పట్లో దీక్ష విరమించారు. స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 23వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించిన అమృతరావు మనవడు గాంధీ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరరక్షణకు జరుగుతున్న పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. భవిష్యత్తు తరాల కోసం జరుగుతున్న ఈ పోరాటంలో విశాఖ, రాష్ట్ర ప్రజలు కూడా పాల్గొని మద్దతు తెలియజేయాలని కోరారు.