Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు ఉద్యమంపై చర్చిస్తాం : బ్రిటన్
న్యూఢిల్లీ : భారత్లో ఉధృతంగా సాగుతున్న రైతు ఉద్యమంపై బ్రిటన్ కీలక వ్యాఖ్యలు చేసింది. '' రైతు ఉద్యమం, నిరసనలు...భారత్ అంతర్గత విషయమే, రైతాంగ సమస్యను భారత ప్రభుత్వమే పరిష్కరించాలి. కానీ, భారత్లో ఆందోళనలు, నిరసనలు చేపట్టిన రైతుల భద్రతపై బ్రిటన్ పార్లమెంట్లో సోమవారం కీలక చర్చ జరగనున్న''దని ఇండియాలో బ్రిటీష్ హైకమిషనర్ అలెక్స్ ఇల్లీస్ అన్నారు. '' రైతు ఆందోళన భారత్ అంతర్గత విషయమే..కానీ, ఈ ఉద్యమం తాకిడి బ్రిటన్లో సైతం ఉంది. కారణం..ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులండటమే. భారత్ను ఉద్దేశిస్తూ..గతంలో బ్రిటన్ విదేశాంగ మంత్రి డోమినిక్ రాబ్ ఒక మాట చెబుతుండేవారు. ' మీ రాజకీయాలే.. మా రాజకీయాలు' అని అంటూండేవారు. అది అక్షరాలా నిజం. భారత్లో నెలకొనే రాజకీయ పరిణామాలు, ఎంతో కొంత బ్రిటన్లో ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈ అంశాలు చర్చించాల్సిందే'' అని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. పత్రికా స్వేచ్ఛ, ఆందోళన చేపట్టిన రైతుల భద్రత అనే అంశాలపై సోమవారం బ్రిటన్ పార్లమెంట్ చర్చించనుంది..అని ఆయన తెలిపారు. రైతు ఆందోళన, పత్రికా స్వేచ్ఛపై చర్చించాలనే పిటిషన్పై బ్రిటన్లో లక్షమందికిపైగా సంతకం చేశారు.