Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో యాంటీ వైరల్ డ్రగ్ రెమిడెసివర్ ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. దేశంలో పరిస్థితులు యథావిధిగా వచ్చేంత వరకు రెమిడెసివర్ ఇంజెక్షన్, రెమిడెసివర్ యాక్టివ్ పార్మా స్యూటికల్స ఇంగ్రిడియంట్ప్ (ఏపీఐ) ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. దేశంలో భారీగా కేసులు పెరుగుతున్నాయని, ఏప్రిల్ 11 నాటికి 11.08 లక్షల క్రియాశీలక కేసులు ఉన్నాయని, అవి క్రమంగా పెరిగే అవకాశం ఉన్నందున, కోవిడ్ బాధితులకు చికిత్సలో భాగంగా అందించే రెమిడెసివర్ డిమాండ్ అమాంతం పెరిగిపోయిందని, రాబోయే రోజుల్లో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున వీటిపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్రం ప్రకటనలో వెల్లడించింది.