Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఎక్కువ మొత్తంలో నగదు బదిలీ చేయడానికి ఉపయోగించే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టిజిఎస్) సేవలు ఏప్రిల్ 18న 14 గంటల పాటు అందుబాటులో ఉండవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. చెల్లింపుల కోసం ఇతర ప్రత్యా మ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ఖాతాదారులకు సూచించింది. రూ.2,00,000 కన్నా ఎక్కువ మొత్తంలో భారీగా డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి లావాదేవీలు జరపడానికి ఆర్టిజిఎస్ ఉపయోగపడుతుంది. గతేడాది డిసెంబర్ నుంచి ఆర్టీజీఎస్ సేవలు 24 గంటల పాటు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దేశంలో ఈ సేవలు 2004 మార్చి 26న అందుబాటులోకి వచ్చాయి.