Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా స్టాక్ ఎక్స్చేంజీ ఎస్ అండ్ పీ డౌజోన్స్ లిస్టింగ్ నుంచి తొలగింపు
న్యూఢిల్లీ: అమెరికా స్టాక్ ఎక్స్చేంజీ ఎస్ అండ్ పీ డౌజోన్స్ భారత్కు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్కు భారీ షాక్ ఇచ్చింది. మయన్మార్ మిలిటరీతో బిజినెస్ సంబంధాలు ఉన్నాయని కారణాన్ని చూపుతూ లిస్టింగ్ నుంచి తొలగించింది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎనకమిక్ జోన్ లిమిటెడ్ను తమ సస్టైనబిలిటీ సూచీ నుంచి తొలగిస్తున్నట్టు ఎస్ అండ్ పీ డౌజోన్స్ ఇండెక్సెస్ వెల్లడించింది. అదానీ పోర్ట్స్ కంపెనీ మయన్మార్లోని యంగూన్లో ఓ రేవును నిర్మిస్తోంది. దీంతో పాటు మయన్మార్ ఎకనామిక్ కార్పొరేషన్ నుంచి భూమిని లీజుకు తీసుకుంది. ఈ నేపథ్యంలో మయన్మార్ సైన్యంతో వ్యాపార సంబంధాలు ఉన్నాయని చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ అంశంపై అదానీ గ్రూప్ స్పందించాల్సి ఉంది. అదానీ పోర్ట్స్ వ్యాపార విభాగం నుండి భూమిని లీజుకు తీసుకున్న అంశంపై అదానీ గ్రూప్ గత నెలలో స్పందించింది. ఈ ఒప్పందంలోని భాగస్వాములతో దీనిపై చర్చిస్తామని వెల్లడించింది.
కాగా, ఫిబ్రవరి 1వ తేదీన మయన్మార్లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అక్కడి ప్రజా ఉద్యమాన్ని సైన్యం అణచివేస్తోంది. దీని కారణంగా ఇప్పటికే వందలాది మంది పౌరులు మరణించారు. దీంతో అమెరికా, బ్రిటన్ దేశాలు మయన్మార్ ఎకనమిక్ కారిడార్, మయన్మార్ ఎకనమిక్ హౌల్డింగ్స్, పబ్లిక్ కంపెనీ లిమిటెడ్స్ పైన ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ను గురువారం ట్రేడింగ్కు ముందు లిస్టింగ్ నుంచి తొలగించే అవకాశముంది.