Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్కతా : కూచ్ బిహార్లో సిఐఎస్ఎఫ్ చేతిలో మరణించిన వారికి సంబంధించి తమ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభిస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ ఘటనకు బాధ్యలైన వారిని గుర్తించి చట్ట ప్రకారం శిక్షిస్తామని తెలిపారు. కుచ్బిహర్ మృతుల కుటుంబ సభ్యుల్ని బుధవారం ఆమె కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి 70 స్థానాలు కూడా లభించవని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. జల్పైగురి జిల్లా దబ్గరామ్-ఫుల్బరిలో బుధవారం జరిగిన ఎన్నికల సభలో ఆమె మాట్లాడారు.