Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాతావరణ మార్పులపై శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : పర్యావరణ పరిరక్షణకు అమెరికాతో కలిసి పనిచేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటిం చారు. వాతావరణ మార్పులపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభమైన వివిధ దేశాధి నేతల శిఖిరాగ్ర సదస్సులో మాట్లాడిన ఆయన ఈ మేరకు ప్రకటిం చారు. కాలుష్యం లేని ఇంధన వినియోగం (క్లీన్ ఎనర్జీ)ను పెంపొందించ డమే లక్ష్యంగా కృషి చేయనున్నట్టు ఆయన చెప్పారు. దీనిలో భాగంగానే 'ఇండో యు.ఎస్ క్లైమేట్, క్లీన్ ఎనర్జీ - ఎజెండా 2030 భాగస్వామ్యం'ను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. అంతకు ముందు అమెరికా అథ్యక్షుడు బైడెన్ మాట్లాడుతూ 'ప్రస్తుతం కనబడుతున్న సంకేతాలు స్పష్టంగా వున్నాయి. సైన్స్ను తోసిపుచ్చలేం. కార్యాచరణ వ్యయం కూడా పెరిగిపోతోంది.'' అని అన్నారు. చైనా, రష్యా, గల్ఫ్ దేశాలు, యురోపియన్, ఆసియన్ మిత్ర పక్షాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.