Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీలో చేరిక
న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మేనల్లుడు రాజీవ్ కుమార్ కోవింద్ బీజేపీకి రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ నుంచి వలసలు పెరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో నేతలు పార్టీలు మారుతున్నారు. పార్టీల జంప్లు ఇంకా పూర్తి కాలేదు. తాజాగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మేనల్లుడు రాజీవ్ కుమార్ కోవింద్ కాషాయ శిబిరాన్ని వీడి... మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీతో చేతులు కలిపారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్నాయి. ఫిబ్రవరి 10న తొలి దశ ఓటింగ్ జరగ్గా.. సోమవారం రెండోదశ ఎన్నికలు జరిగాయి. తదుపరి ఐదు దశలు ఫిబ్రవరి 20, ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 27, మార్చి 3, మార్చి 7 తేదీల్లో.. మార్చి 10న కౌంటింగ్ నిర్వహించనున్నారు.