Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: బాణాసంచాపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. టపాకాయలు కాల్చడం ద్వారా వచ్చే అనారోగ్యంపై, ప్రమాదాలపై ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని కోర్టు ప్రభుత్వాలకు సూచించింది. బాణాసంచాను కాల్చవద్దని సూచించాలని కోర్టు ప్రభుత్వాలకు సూచించింది. అలాగే బాణసంచా కాల్చడాన్ని నిరుత్సాహపరచాలని పేర్కొన్నది. బాణాసంచా చెడు ప్రభావాలపై పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు, లెక్చరర్లకు, ప్రొఫెసర్లకు సూచిస్తామని సుప్రీంకోర్టు బెంచ్ చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు, అమితవ రారు అన్నారు. పిల్లలకు కాలుష్యరహిత వాతావరణం కల్పించాలని, బాణాసంచా చెడు ప్రభావాలను నివారించాలని కోరుతూ ఆరు నుంచి 14 మాసాల వయసున్న పిల్లల తండ్రులు ముగ్గురు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పండుగల సందర్భంగా బాణాసంచా కాల్చుతుండటంతో ఢిల్లీలో లెక్కలేనంత కాలుష్యం వెలువడుతోందని, దీని ద్వారా ఊపిరితిత్తుల వ్యాధులు, ఆస్తమా, దగ్గు, బ్రాంకైటిస్, నాడీ వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పిటిషన్లో వివరించారు. ఈ కేసును సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వి కోర్టులో పిటిషన్నర్ల తరఫున వాదిస్తున్నారు.