Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రాన్ని ప్రశ్నించిన ఢిల్లీ సిఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: నగరాల్లోని ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా, మంచి నీరు ఇవ్వకుండా స్మార్ట్సిటీ (ఆకర్షణీయ నగరాలు)లు నిర్మాణం చేయడం వల్ల ప్రయోజనమేమి ఉండదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ట్రాఫిక్ ట్రైనింగ్ పార్క్ సమీపంలో ఆదివారం ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు మౌలిక వసతులు కల్పించకుండా, కేవలం రోడ్ల నిర్మాణం చేపట్టడం ద్వారానే వాటిని ఆకర్షణీయ నగరాలని పిలువ లేమన్నారు. ధనవంతులు నివసిస్తున్న ప్రాంతాల్లో 24 గంటలపాటు నీటి సరఫరా చేస్తూ, పేదలు నివసిస్తున్న కాలనీలకు నీటి సరఫరాలో కోత విధించడం సరికాదన్నారు. సామాన్య ప్రజలు నీటి కోసం నిరంతరం ఆందోళన నిర్వహిస్తూనే ఉన్నారని చెప్పారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించకుండా స్మార్ట్ సిటీలను నిర్మించడం సాధ్యం కాదన్నారు. కేంద్రం చేపట్టిన స్మార్ట్ సిటీల నిర్మాణాన్ని ఆయన తప్పుపట్టారు. ఢిల్లీ నగరంలో నాణ్యమైన విద్యను బోధించవలసిన అవసరం ఉందన్నారు. ఈ ఆవశ్యకతను అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలన్నారు.