Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి మాల్యాద్రి ఖండన
విజయవాడ : పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మం డలం గుళ్లపాడుకు చెందిన కంకిపాటి రమేష్బాబు, చిడిపి శ్రీను, వంగలపూడి శ్యాంసన్లను కోళ్ల దొంగతనం చేశారనే నెపంతో తల్ల కిందులుగా వేలాడదీసి చిత్రహింసలకు గురి చేశారని పేర్కొం టూ.. ఆ సంఘటనను కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి ఖండిం చారు. నిందితులు అగ్ర కుల పెత్తందారులైన నాదె ండ్ల పూర్ణయ్య, మద్దిపాటి వెంకటేశ్వరరావు, లక్ష్మీ నారాయణ, సుధీర్ మరికొందరిని ఎస్.సి ఎస్.టి అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. దోషులను శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నా నివారిం చాల్సిన ప్రభుత్వం పట్టించుకోకుండా రాజధాని నిర్మాణ జపం చేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సి, ఎస్టి కమిషన్కు ఛైర్మన్ సభ్యులను నియమిస్తామని చెప్పి 2014 ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకూ ఆ దిశగా చర్యలు చేపట్టలేదన్నారు. వెంటనే ఎస్సి. ఎస్టి కమిషన్కు పూర్తి కమిటీి వేసి దాడుల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.