Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాదయాత్రలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విజయనగరం : రాష్ట్ర విభజనతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్ర దేశ్కు ప్రత్యేక హోదా, వెను కబడిన ఉత్తరాంధ్ర, రాయ లసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎపి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యాన విజయ నగరంలో సోమవారం పాదయాత్ర జరిగింది. ఇందులో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, మేధావుల సంఘం నాయకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ, అడ్డుగోలుగా విభజించిన ఆంధ్రప్రదేశ్ను అన్నివిధాలా ఆదుకుంటామని ఎన్నికల ముందు చెప్పిన బిజెపి, అధికారంలోకొచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, వైసిపి జిల్లా అధ్యక్షులు కోలగట్ల వీరభద్రస్వామి, పెనుమత్స సాంబశివరాజు, నిరుద్యోగ ఐక్యవేదిక నాయకులు లగుడు గోవిందరావు పాల్గొన్నారు.