Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుంటూరు : ప్రధాని నరేంద్రమోడి పర్యటన సోమవారం అధికా రికంగా ఖరారైంది. రాజధాని శంకుస్థాపన కార్యక్రమం సంద ర్భంగా తుళ్లూరు మండలం ఉద్దండ్రాయునిపాలెంలో 75 నిమిషాలే ఉంటారని ఈ కార్యక్రమం షెడ్యూలులో అధికారులు తెలిపారు. 22న మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని వేదిక వద్దకు వస్తారు. అమరావతి దృశ్య రూపకాన్ని పరిశీలిస్తారు. 12.35 గంటలకు అమరావతి రాజధానికి శంకుస్థాపన చేస్తారు. 1.11 గంటలకు ప్రధాని మోడి ప్రసంగం ప్రారంభమవుతుంది.1.43కి ఆయన ప్రసంగం ముగుస్తుంది. తరువాత సన్మానం, అమరావతి జ్ఞాపిక బహూకరణ ఉం టుంది. 13.46కి ఆయన వేదిక నుంచి దిగి హెలికాప్టర్ ద్వారా గన్నవరం వెళ్తారు.