Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయవాడ: రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రత్యేక హెలికాఫ్టర్ నుంచి పరిశీలించారు. అమరావతి నిర్మాణానికి దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, నదుల నుంచి సేకరించిన మట్టిని, నీటిని హెలికాఫ్టర్ నుంచి రాజధాని ప్రాంతంలో చల్లారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ వాస్తు ప్రకారం ఉండవల్లి నుంచి చల్లితే మంచిదని, ముందు అక్కడి నుంచి చల్లామని తెలిపారు. అనంతరం సీడ్ క్యాపిటల్ పరిధిలో నీటిని చల్లారు. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పవిత్ర జలాలతో గురువారం శంకుస్థాపన సమయంలో ప్రధాన మంత్రితో కలిసి పూజలు, హోమం నిర్వహిస్తామని చెప్పారు. క్రమశిక్షణతో చేసుకోగలిగితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని 10 ఉత్తమ రాజధానుల్లో అమరావతి ఒకటిగా ఉండాలని ఆకాంక్షించారు. సేకరించిన మట్టి, జలాలతో స్మారక కట్టడాన్ని 25 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతంగా నిర్మిస్తామని చెప్పారు.