Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భార్యాభర్తల పరిస్థితి విషమం.. కుమార్తెకు తీవ్రగాయాలు
ద్వారకాతిరుమల/ ఏలూరు:కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ ఉన్మాది దళిత మహిళ, ఆమె కుమార్తెలపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. అడ్డుపడిన ఆ కుటుంబపెద్దపై దాడిచేసి.. ఆ కుంటుంబాన్ని సజీవ దహనం చేసేందుకు యత్నించాడు. ఈ సంఘటన బుధవారం అర్ధరాత్రి పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెంలో చోటుచేసుకుంది. ఈ కీచక పర్వంలో గాయపడిన భార్యాభర్తల పరిస్థితి విషమంగా ఉండగా, కుమార్తె తీవ్రగాయాలపాలైంది. ఏలూరు డిఎస్పి సరిత, గ్రామస్తుల కథనం ప్రకారం.. పంగిడిగూడెం పంచాయతీ హనుమాన ్గూడేనికి చెందిన సక్కాబత్తుల రాంబాబు (40), భార్య (30), 13, 11 ఏళ్ల కుమార్తెలతో కలిసి మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో ఆరుతడి పంటలు సాగుచేసుకుంటూ, అక్కడే నివాసం ఏర్పర్చుకున్నాడు. దెందులూరు మండలం గాలాయ గూడేనికి చెందిన వడ్లమూడి బాలకృష్ణ తల్లిదండ్రులతో గొడవపడి, పంగిడిగూడెంలో తాత వద్ద ఉంటున్నాడు. రాంబాబు పొలంలో పని చేస్తున్నాడు. పొలంలోని సొరకాయలను బుధవారం కోసి రాం బాబు, బాలకృష్ణ కలిసి భీమడోలు మార్కెట్కు తరలించి విక్రయించారు. ఆ సొమ్ముతో బాలకృష్ణ, రాంబాబు మద్యం సేవించి ఇళ్లకు చేరినట్లు తెలిసింది. బుధవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో బాలకృష్ణ రాంబాబు ఇంటికి వచ్చి, అతని భార్యపై అత్యాచారానికి ప్రయత్నించాడు. రాంబాబు అడ్డుకోగా, ఇనుప రాడ్డుతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. రాంబాబు పెద్ద కుమార్తెపైనా అత్యాచారయత్నం చేయగా, పారిపోయేందుకు ప్రయ త్నించింది. దీంతో, బాలికను గడ్డివాములోకి తోసి నిప్పంటించాడు. గడ్డివాముతోపాటు రాంబాబు నివాసానికి నిప్పంటుకుని, గ్యాస్ సిలెండర్ పేలింది. రాంబాబు చిన్నకుమార్తె మంటల నుంచి సురక్షితంగా బయటపడి స్థానికులకు సమాచారం ఇచ్చింది. తీవ్రంగా గాయపడిన రాంబాబు, అతని భార్యను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, 30 శాతం కాలిన గాయాలతోనున్న వారి పెద్దకుమార్తె ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసినట్లు తెలిసింది.
దళిత యువకులపై దాడిచేసిన వారిని శిక్షించాలి : కెవిపిఎస్
ద్వారకా తిరుమల మండలం గుళ్లపాడు, బుట్టాయ గూడెం గ్రామాల్లో దళిత యువకులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతి రేక పోరాటసంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు డిమాండ్ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూ రు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను శుక్రవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా సుబ్బా రావు మాట్లాడుతూ దళితులపై దాడి జరిగి ఏడు రోజులైనా, నిందితులైన అగ్రవర్ణ పెత్తందారులను అరెస్టు చేయకపో వడం దుర్మార్గమన్నారు. గాయపడిన యువకులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. పెత్తందారుల ఆగడాలకు టిడిపి ప్రభుత్వం కొమ్ముకాస్తోందని విమర్శించారు. దళిత మంత్రులుగాని, ఎంఎల్ఎలుగాని ఇప్పటివరకూ బాధితులను పరామర్శించకపోవడం సిగ్గు చేటన్నారు.