Authorization
Mon Jan 19, 2015 06:51 pm
థానే: అంగన్వాడీలకు జీతాలు చెల్లించాలనే డిమాండ్తో, దేశవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి ఫిబ్రవరి 15న పార్లమెంట్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని శనివారం మహారాష్ట్ర రాజ్య అంగన్వాడీ కర్మచారి సంఫ్ు అధ్యక్షుడు ఎంఎ పాటిల్ తెలిపారు. గత ఆరు నెలలుగా పలు రాష్ట్రాల్లోని అంగన్వాడీలకు వేతనాలు అందడం లేదని వెల్లడించారు. కార్మికుల జీతాలతో పాటుగా అంగన్వాడీ ప్రాంగణాలకు కూడా అద్దెలకు నిధులు విడుదల చేయడం లేదన్నారు. దాని ఫలితంగా పలు అంగన్వాడీ కేంద్రాలను ఖాళీ చేయిస్తున్నారనీ, లేదా వాటి యజమానులు సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. సీఐటీయూ, ఏఐసీసీటీయూ, ఏఐయూటీయూ సీ, ఏఐటీయూసీ, హెచ్ఎమ్ఎస్, ఐఎన్టీ యూసీ సంఘాలతో ఏర్పడిన యాక్షన్ కమిటీ బడ్జెట్ సమావేశాలు జరుగున్న సమయంలో పార్లమెంట్ మోర్చకు పిలపునిచ్చి నట్టు పాటిల్ తెలిపారు. బడ్జెట్లో ఐసీడీఎస్కు నిధులను తగ్గించడాన్ని ఆయన ఖండించారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఐసీడీఎస్కు 2014-15లో రూ 18,108 కోట్లును కేటాయించగా, 2015-16లో రూ 8,245,77 కోట్లనే కేటాయించిందని తెలిపారు. నిధుల్లో భారీ తగ్గింపు వల్ల బీహర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ పథకం దెబ్బతింటోందని తెలిపారు.