Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భార్య ఫిర్యాదును పట్టించుకోని తమిళనాడు పోలీసులు
మదురై: దళిత మెకానిక్ ఒకరు కనిపించకుండా పోయిన కేసులో మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన్ని వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాల్సిందిగా తమిళనాడు పోలీసులను ఆదేశించింది. బాధితుడి భార్య కె.మహాప్రియ వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై హైకోర్టు స్పందించింది. ఓ ద్విచక్ర వాహనాల డీలర్ వద్ద మెకానిక్గా పని చేసే తన భర్త కలైవనం ఈ నెల 2 నుంచి కనిపించకుండా పోయారని మహాప్రియ పిటిషన్లో పేర్కొన్నారు. రైడింగ్ పరీక్ష కోసం కలైవనం తీసుకెళ్లిన బైక్ సింగపతి ఫోర్ట్ హిల్స్ వద్ద పడి ఉండగా, ఆయన మాత్రం కనిపించకుండా పోయారని మహాప్రియ తెలిపారు. సంఘటనకు ముందు వాహనాల డీలర్ సన్నాసి, ఆయన కుమారుడు విక్కీతో కలైవనం గొడవ పడినట్టుగా తెలుస్తున్నది. దాంతో, వారిద్దరూ తంగప్రకాశ్ అనే మరో వ్యక్తితో కలిసి కలైవనంను కత్తితో పొడిచి చంపి, శవాన్ని కనిపించకుండా చేశారని అనుమాని స్తున్నారు. దీనిపై ఫిబ్రవరి 4న తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మహాప్రియ ఆరోపిస్తున్నారు. సన్నాసి కుటుంబానికి రాష్ట్ర మంత్రి ఒకరితో సన్నిహిత సంబంధాలు ఉన్నందునే థేనీ జిల్లా ఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని మహాప్రియ ఆరోపించారు. మార్చి 9 వరకల్లా పోలీసులు దీనిపై సమాధానం ఇవ్వాలని జస్టిస్ ఎ.సెల్వం, జి.చొక్కలింగంతో కూడిన హైకోర్టు బెంచ్ ఆదేశించింది.