Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండీగఢ్ : జేఎన్యూ విద్యార్థినులపై హర్యానా సిఎం మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) నోరు పారేసుకున్నారు. యూనివర్శిటీలోని విద్యార్ధినులను వ్యభిచారులంటూ మాజీ ఓఎస్డీ జవహర్ యాదవ్ పేర్కొన్నారు. తర్వాత, తన ట్వీట్కు తప్పుడు భాష్యం చెప్పారంటూ వివరణ ఇచ్చారు. ఎవరి మనోభావాలను గాయపరచాలని తాను భావించడం లేదని, తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు.
విద్యార్థినులను వ్యభిచారులతో తాను పోల్చలేదని ఆయన స్పష్టం చేశారు. జేఎన్యూలో జాతి వ్యతిరేక నినాదాలు చేస్తున్న విద్యార్ధినులకన్నా వ్యభిచార వృత్తిలోకి బలవంతంగా దిగిన మహిళలు మెరుగని తాను ట్వీట్ చేశానని చెప్పుకున్నారు. వారు తమ శరీరాలనే అమ్ముకుంటున్నారు కానీ దేశాన్ని కాదని మరో ట్వీట్లో పేర్కొన్నారు.