Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భూ సేకరణ బిల్లుపై రాజకీయ ఏకాభిప్రాయం కనుచూపు మేరలో కానరానందున దీనిపై పార్లమెంట్కు నివేదికను సమర్పించేందుకు పార్లమెంట్ సంయుక్త కమిటీ (జెసిపి) మరికొంత సమయాన్ని కోరే అవకాశం వుంది. కాగా, ఈనెల 21నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బహుశా ఈ బిల్లు పరిశీలనకు రాకపోవచ్చునని భావిస్తున్నారు. నివేదిక సమర్పించడానికి గడువును పెంపొందించాలని పలువురు కమిటీ సభ్యులు అభిప్రాయపడుతున్నందున బిజెపి సభ్యుడు ఎస్.ఎస్.అహ్లూవాలియా నేతృత్వంలోని కమిటీ ఈ మేరకు పార్లమెంట్ను కోరనుంది. జులై 21 నుండి 28కి గడువును పెంచాలని కోరనున్నారు.