Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీం కోర్టుకు నివేదించిన ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: దేశంలో పౌరులందరూ తప్పనిసరిగా ఓటు వేయాలని లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటు వేయడం వేయక పోవడం అనేది పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛ కిందికే వస్తుందని సుప్రీం కోర్టుకు ఈసీ అఫిడ విట్ రూపంలో నివేదించింది. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బెల్జియం, బ్రెజి ల్ దేశాల్లో మాదిరిగానే ఓటు వేయడాన్ని తప్పనిసరి చేయాలని కొందరు వ్యక్తులు ఇటీవల సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేసు విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం ఈసీ అభిప్రాయాన్ని కోరింది.