Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ తర్వాతే మందిరాలు
- మానవ సేవే మాధవ సేవ.. అదే వివేకానందుని సందేశం : మోడీ
న్యూఢిల్లీ: దేవాలయాలకన్నా మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపు నిచ్చారు. చికాగోలో నిర్వహింంచిన ప్రపంచ మతాల సదస్సులో స్వామి వికేకానంద చేసిన చారిత్రక ప్రసంగం 125వ వార్షికోత్సవం సందర్భంగా స్వచ్ఛభారత్ ప్రాధాన్యతను యువతకు ప్రధాని గుర్తు చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. 'ఈరోజు సెప్టెంబర్ 11, అనగానే మనకు మొదట న్యూ యార్క్పై 2001లో జరిగిన దాడులు గుర్తుకొస్తాయి. 1893లో ఇదే రోజున స్వామి వికేకానంద చికాగోలో చేసిన ప్రసంగాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆయన ప్రేమ,సామరస్యత, సౌభ్రాతృత్వం గురించి సందేశమిచ్చారని ప్రధాని మోడీ అన్నారు. ఆనాటి ప్రసంగం ద్వారా దేశానికి ఒక కొత్త గుర్తింపు వచ్చిందని ప్రధాని మోడీ తెలిపారు. వివేకానందుని బోధనలు అందరికీ మార్గదర్శకమని, ప్రత్యేకించి యువతకు అని ప్రధాని తెలిపారు. కేవలం కర్మకాండల నిర్వహణతో ఏ వ్యక్తీ దేవునికి దగ్గర కాలేరని, మానవ సేవే మాధవ సేవ అన్నది వికేకానందుని సందేశమని ప్రధాని స్పష్టం చేశారు. ఏది తినాలి? ఏది తినకూడదో చెప్పే సంస్కృతి మనదికాదని అన్నారు.
వివేకానందుడి సందేశమే మనకిపుడు మ్యాగ్నాకార్టా : సోనియాగాంధీ
ఈసందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన మరో కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోని యాగాంధీ ప్రసంగించారు. అసహ నం, విద్వేషం నెలకొన్న నేటి పరిస్థితుల్లో స్వామి వివేకానందుని చారిత్రక సందేశమే మ్యాగ్నాకార్టాగా గుర్తు చేసుకొని ముందుకు సాగాలని సోనియా అన్నారు. (మ్యాగ్నా కార్టా: 1215లో బ్రిటన్ రాజు ఆమోదించిన హక్కుల పత్రం). మతాలన్నిటి సారాంశం ఒక్కటేనని, మనుషులంతా సమానమేనని, సార్వత్రికత గురించి ప్రపంచానికి వివేకానందుడు చాటారని సోనియా అన్నారు. 'లే వండి, మేల్కొనండి, గమ్యం చేరుకునేదాకా ఆగబోకండి' అంటూ యువతకు ఆయన ఇచ్చిన సందేశాన్ని సోనియా గుర్తు చేశారు.