Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్ : ఆర్టికల్ 35ఎకు తాము వ్యతిరేకం కాదని కేంద్ర హోం శాఖ మం త్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దీనిపై అనవసరంగా వివాదం రాజుకుందని, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యా ప్రారంభించలేదని, దీనిపై తమ ప్రభుత్వం కోర్టుకు కూడా వెళ్లడం లేదని అన్నారు. ప్రజల మనోభావాలకు వ్యతిరే కంగా తాము ఏమీ చేయమని, మనోభావాలను గౌరవిస్తామని తెలిపారు. ఆర్టికల్ 35ఎపై ఎలాంటి అనుమానాలు, సందేహాలు లేవని, దురదృష్టవశాత్తూ ఈ అం శం బయటికివచ్చిందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నాలుగు రోజుల జమ్మూకాశ్మీర్ పర్యటనలో భాగంగా సోమవారం శ్రీనగర్లో రాజ్నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పర్యటించడం రాజ్నాథ్కు ఏడాదిలో ఇది ఐదవ సారి. ప్రస్తుత పర్యట నలో భాగంగా ఆదివారం సమస్యాత్మకమైన అనంత్నాగ్లో పర్యటించారు.ొ ఐదుగురు మృతి..బీహార్లో ఘటన
పాట్నా : బీహార్లో మద్యం మాఫియా అరాచకాలు శృతిమిం చాయి. తమ కార్యకలాపాలకు అడ్డొచ్చిన అధికారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. శాంతి భద్రతలను పరిరక్షించే పోలీసులపైనూ విరుచుకుపడుతూ అశాంతియుత వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. తాజాగా, మద్యం మాఫియాకు చెందిన ఓ ట్రక్కు పోలీసులపైకి దూసుకెళ్లడంతో ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ముజఫర్పూర్ జిల్లాలో సోమవారం చోటుచేసుకున్నది. ముజఫర్పూర్ సీనియర్ ఎస్పీ వివేక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం...ఓ ట్రక్కు పానాపూర్ ఔట్పోస్ట్ మార్గంలో లిక్కర్ బాటిళ్లతో తరలివెళ్తున్నట్టు సమాచారం అందింది. డీఎస్పీ క్రిష్ణమురారీ ప్రసాద్ నేతృత్వంలోని బృందాలు హుటాహుటిన పానాపూర్ పోలీస్పోస్ట్ వద్దకు చేరుకున్నాయి. ట్రక్కును నిలిపివేసి తనిఖీలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. ఈ విషయాన్ని గ్రహించిన డ్రైవర్ ఒకేసారి ట్రక్కును అతివేగంగా పోలీసులపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. డీఎస్పీ క్రిష్ణమురారీ ప్రసాద్ సహా నలుగురు పోలీస్ అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా, బీహార్లో మద్యం అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. గతేడాది ఏప్రిల్ నుంచి మద్యం అక్రమ రవాణా కేసుల్లో 60వేల మంది అరెస్టయినట్టు పోలీస్ అధికారులు తెలిపారు.