Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
లక్నో : లంచాలపై ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 'సంపాదించు కోండి.. కానీ మీ ఆహారంలో ఎంత ఉప్పు వేసుకుంటారో అంత మాత్రం వరకే సంపాదించుకోండి..' అని ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు లంచాలను ప్రోత్సహించేలా ఉన్నాయంటూ విమర్శ లు వెల్లువెత్తుతుండగా.. అవినీతికి వ్యతిరేకంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనీ, తప్పుగా అర్థం చేసుకోవద్దనీ మౌర్య సన్నిహితులు సర్దిచెబుతు న్నారు. 'కాంట్రాక్టర్ డబ్బు సంపాదించుకోవద్దని ఎవరూ అనరు. అవినీతి రహిత వ్యవస్థ రావాలని మేము కోరుకుంటున్నాం. ఒకరోడ్డు నిర్మించేపని లో ఉన్న అధికారులు, కాంట్రాక్టర్లు ప్రజాధ నాన్ని దోచుకోవడం సరికాదు. సంపాదించుకోండి. కానీ, మన వంటల్లో ఎంత ఉప్పు వాడతామో అంతే నగదు తీసుకోండి.
డబ్బు సంపాదించొద్దనీ, వ్యాపారం చేయొద్దనీ ఎవరు అనరు. కానీ, ప్రజా ధనాన్ని దోచుకోవద్దు' అని కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో పబ్లిక్ వర్క్స్ శాఖను మౌర్య చూస్తున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో టీవీ చానల్స్ తన వ్యాఖ్యలను వక్రీకరించాయని మౌర్య అంటున్నారు.