Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మలం తిని నిరసన
- నేడు నగ ప్రదర్శన చేపడతాం
- రాజధానిలో తమిళ రైతుల ఆగ్రహ జ్వాలలు
చెన్నై : గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో ఆందోళన చేస్తున్న తమిళ రైతుల గోస అటు కేంద్రానికి కానీ, ఇటు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పట్టలేదు. రెండో విడతగా ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న తమిళరైతుల ఆందోళన తారాస్థాయికి చేరింది. దేశ ప్రజలకు ఆహారధా న్యాలను అందించే అన్నదాత చివరకు తమ మలాన్ని తామే తిని ప్రభుత్వాలపై నిరసన వ్యక్తం చేశాడు. దక్షిణ భారత నదుల అనుసంధాన రైతుల జాతీయ సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను నేతృత్వంలో పది మంది రైతులు 58 రోజులుగా జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్నారు. ఆదివారం ఉదయం తమ మలాన్ని ప్లాస్టిక్ బ్యాగుల్లో సేకరించిన రైతులు.. నినాదాలు చేస్తూ తినేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం 58 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించడంలేదని అయ్యాకన్ను విమర్శించారు. అందుకే, నిరసన కార్యక్రమాల మోతాదును పెంచాలని నిర్ణయించుకున్నామని అన్నారు. మంగళ వారం జంతర్ మంతర్ నుంచి ప్రధాని కార్యాలయం వరకు భారీర్యాలీగా వెళ్లి నగప్రదర్శన నిర్వహించను న్నట్టు వెల్లడించారు. ఇదిలా ఉండగా, కావేరీ బోర్టు ఏర్పాటు, బ్యాంకు రుణాలు మాఫీ చేయడంతో పాటు పంట నష్టపోయిన రైతుల కుటుంబాలను ఆదుకో వాలని అయ్యకన్ను నేతృత్వంలో తమిళ రైతులు డిమాండ్ చేశారు. సీఎం కుర్చీ కోసమే తమిళ నేతలంతా పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. తమ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధిలేదని విమర్శిస్తున్నారు. వ్యవసాయం చేయలేకపో తున్న రైతులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
28 మంది రైతులు అరెస్ట్
జంతర్మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన కార్యక్ర మాలు నిర్వహిస్తున్న రైతులపై ఢిల్లీ పోలీసులు రెచ్చిపోయారు. లాఠీలతో రైతులను భయబ్రాం తులకు గురిచేయాలని ప్రయ త్నించారు. నిరసన కారులను చెదరగొట్టారు. నిరసన కార్యక్రమాలను కొన సాగిస్తామని భీష్మించి కూర్చొన్న 28 మంది రైతులను అదుపులోకి తీసుకుని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
దీంతో, ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. రైతుల సమస్యలను పరిష్కరిస్తామని గతంలో తమిళనాడు సీఎం పళనిస్వామి భరోసా ఇవ్వడంతో రైతులు నిరసన కార్యక్రమాలను పాక్షికంగా విరమించారు. సీఎం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడంతో జంతర్మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలను పునరుద్ధరించారు.