Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బహిరంగ మల విసర్జన చేసే మహిళల్ని ఫోటోలు తీయడం
- వృద్ధులపైనా దాడులు
- కాపలాదారులుగా ఉపాధ్యాయురాళ్లు, అంగన్వాడీ కార్యకర్తలు
- అధికారులకు నివేదికలివ్వాలని బెదిరింపులు
- బీజేపీ పాలిత రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో 'టాయిలెట్ విజిలెంటిజమ్'
జైపూర్/భోపాల్: గోరక్షణ పేరుతో జరిగిన హింసాత్మక ఘటనలు మరువకముందే ఉన్మాదులు మరో కొత్త తరహా దాడులను ప్రారంభించారు. అదే టాయిలెట్ విజిలెంటిజమ్..బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేసేవారిపై దాడులు. ఉన్మాదం తలకెక్కిన దుండగులు మహిళల విషయంలోనూ అనాగరిక దాడులకు పాల్పడుతున్నారు.
ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. దేశానికి బహిరంగ మల విసర్జన నుంచి విముక్తి కల్పించాలన్న సంకల్పం అభినందించదగిందే అయినా..మారుమూల గ్రామాల్లోని ప్రజలు, పట్టణాల్లోని పేదలు చాలామంది ఇంకా తమ ఇండ్లలో మరుగుదొడ్లను నిర్మించుకోలేకపోయారు. అందుకు వారి పేదరికం లేదా వారి ప్రాంతాల్లో తగినంత నీరు అందుబాటులో లేకపోవడడం కారణాలవుతున్నాయి. ఈ వాస్తవాన్ని గుర్తెరగకుండా బీజేపీ పాలిత రాజస్థాన్, మధ్యప్రదేశ్వంటి రాష్ట్రాల్లో మహిళలపై, వృద్ధులపై పలు అమానుష దాడులు జరిగాయి. దాడులకు గురైన వారిలో ఎక్కువభాగం పేద, దళిత, బహుజన వర్గాలకు చెందినవారే.. రాజస్థాన్లోని ప్రతాప్ గఢ్లో ఈ ఏడాది జూన్ 16న జాఫర్ హుస్సేన్ హత్యకు గురయ్యారు. బహిరంగ మల విసర్జన చేస్తున్న మహిళలను మున్సిపల్ ఉద్యోగులు ఫోటో తీస్తుండగా జాఫర్ అడ్డుకున్నారు. దాంతో, ఆయన్ని హత్యగావించారు. ఆ ప్రాంతంలో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, నీటి వసతి కల్పించాలని ప్రభుత్వ అధికారులకు జాఫర్ పలుమార్లు విజ్ఞప్తి చేసిన అనంతరం ఈ సంఘటన జరిగింది. ఇదే రాష్ట్రంలో కొన్ని చోట్ల పురుషులు బహిర్భూమికి వెళ్లే ప్రదేశాల్లో మహిళలను కాపలా పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రతిరోజూ ఉదయాన్నే మహిళలు విధిగా తమ బాధ్యత నిర్వహించాలి. రాజస్థాన్కు చెందిన ఓ వార్తాపత్రిక కథనం ప్రకారం పాఠశాల ఉపాధ్యాయురాళ్లకు కూడా ఇటువంటి బాధ్యతలు అప్పజెబుతున్నారు. వారు పాఠశాలలోని రిజిస్టర్లోకన్నా బహిర్భూమి వద్ద హాజరు పట్టీలో సంతకం చేయడం తప్పనిసరి. అంతేకాదు..అక్కడ వారు కాపలా కాసినట్టు సెల్ఫీ సాక్ష్యాలు కూడా చూపించాలి. గ్రామస్తులు బహిర్భూమికి వెళ్లకుండా అడ్డు కోవడంలో విఫలమైతే క్రమశిక్షణా చర్యలు. ఇటువంటి బాధ్యతలను టీచర్లతోపాటు అంగన్వాడీ కార్యకర్తలు, ఆస్పత్రుల్లో పని చేసే నర్సులు, ఇతర మహిళలకు అప్పగిస్తున్నారు. కాపలాగా ఉండే మహిళలు బహిర్భూమికి వెళ్లే మహిళల విషయంలో కేవలం అడ్డు కుంటే సరిపోదు. వారి ఫోటోలను తీసి పాఠశాల ప్రిన్సి పాల్కు అందించాలి. సంబంధిత ఉన్నతాధికారులకు క్రమం తప్పకుండా ప్రిన్సిపాల్ తన నివేదికలను సమర్పించాలి.
చాలా పట్టణాలు, గ్రామాల్లో టాయిలెట్ విజిలెంటిజమ్లో పాల్గొనేవారికి నగదు ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నట్టు తెలుస్తున్నది. మధ్యప్రదేశ్లోని ఉజ్జెయినిలో బహిరంగ మల విసర్జన చేసినందుకు ఓ వృద్ధుడికి విధించిన శిక్ష క్రూరత్వాన్ని చాటేలా ఉన్నది. ఆ వృద్ధుడిని తన దోతీతో మలాన్ని ఎత్తిపోసేదాకా కొట్టారు. మరోచోట ఓ వ్యక్తిని ప్యాంట్ ఊడదీసి బిస్కీలు తీయించారు. రాజస్థాన్లోని గ్రామాల్లో మరుగు దొడ్లు నిర్మించుకోని కుటుంబాలకు సబ్సిడీ ఆహార ధాన్యాలు, ఇతర సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారు. తమిళనాడులోని ఓ గ్రామ పంచాయితీకి గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను నిలిపి వేశారు.
(KN post.com సౌజన్యంతో)