Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : నూతన అసెంబ్లీ భవన నిర్మాణానికి దసరా సందర్భంగా ఈ నెల 30న శంకుస్థాపన చేయనున్నట్లు మున్సిపల్ శాఖమంత్రి పి నారాయణ వెల్లడించారు. నార్మన్ ఫాస్టర్ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బుధవారం కలిసి అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాలకు సంబంధించిన డిజైన్లను చూపిస్తారని తెలిపారు. వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ భవన సముదాయల డిజైన్లపై హైకోర్టు న్యాయమూర్తుల కమిటీని తమ శాఖాధికారులు కలిశారన్నారు. హైకోర్టు సూచించిన డిజైన్లపై చర్చించి, వారి సలహాలు తీసుకుంటామ న్నారు.అసెంబ్లీ హాల్ పైభాగం, సెక్రెటేరియట్తో పాటు హైకోర్టు డిజైన్లు తీసుకోస్తారన్నారు. గతంలో ఫాస్టర్ సభ్యులు డైమండ్ ఆకారపు భవన నిర్మాణాన్ని తీసుకొచ్చారని, సీఎం సూచన మేరకు మరికొన్ని డిజైన్లు తీసుకొస్తారని తెలిపారు.
అసెంబ్లీ భవన నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పిలిచామని, ఈ నెల 25,26 తేదిల్లో వీటిని ఖరారు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 44 నైట్ షెల్టర్లున్నాయని, త్వరలో అన్ని మేజర్ మున్సిపాల్టీల్లోనూ వీటిని ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారన్నారు. మెప్మాలో 34.19 లక్షల కుటుంబాలున్నాయని, మురికి వాడల్లో 44.17 లక్షల సభ్యులున్నారని తెలిపారు. వీరిని అభివృద్ధిపథంలో తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. మెప్మా ఆధ్వర్యంలో అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. మెప్మా సభ్యుల ఆదాయం పెరుగుదలకు చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారన్నారు.