Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీధర్బాబు బాధ్యతలు స్వీకరణ
గుంటూరు : పొగాకు బోర్డు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి తొలిగా నియమితులైన అద్దంకి శ్రీధర్ బాబు గుంటూరు లోని కార్యాలయంలో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. 2008 బ్యాచ్కు చెందిన శ్రీధర్ బాబు ఉత్తరాఖండ్లో వివిధ జిల్లాలకు కలెక్టర్గా, రాష్ట్ర స్థాయిలో వివిధ బాధ్యతలు నిర్వహించారు. గతంలో బోర్డు చైర్మెన్ బాధ్యతలు ఐఏఎస్ అధికారి నిర్వర్తించే వారు, తర్వాత చైర్మెన్ పోస్టును రాజకీయ నాయకులకు ఇవ్వాలని నిర్ణయించిన తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టుకు ఐఏఎస్ అధికారిని నియమించారు. అయితే చైర్మెన్ పదవిని భర్తీ చేయకపోవటంతో ఈడీ వెంకటేష్ ప్రస్తుతం ఇన్చార్జి చైర్మెన్గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో కార్యదర్శి పోస్టులో శ్రీధర్బాబును నియమించటంతో పొగాకు బోర్డుకు ఇద్దరు ఐఏఎస్లను నియమించినట్లయింది. ఈ సందర్భంగా శ్రీధర్బాబు మీడియాతో మాటా ్లడుతూ.. రైతుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యంగా కృషి చేస్తానని చెప్పారు.