Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హిస్సార్ : హర్యానాలో మరో దుర్మార్గ ఘటన చోటుచేసుకుంది. పెండ్లికి నిరాకరించిందన్న అక్కసుతో ఒక విద్యార్థినిని కత్తితో పొడిచి హత్య చేశాడా దుర్మార్గుడు. హర్యానాలోని హిస్సార్లో మంగళవారం పట్ట పగలు ఒక ఫాస్ట్ ఫుడ్ దుకాణం వద్ద ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలైన పూజ (19) అక్కడికక్కడే మృతిచెందింది. నిందితుడు నవీన్ (23)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూజ స్థానిక ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదువుతున్నట్టు పోలీసు అధికారి మణిదీప్ సంగ్వాలా చెప్పారు. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన నవీన్ ఉద్యోగ వేటలో ఉన్నాడని, ప్రేమ పేరుతో పూజను గత కొంతకాలంగా వెంబడిస్తున్నట్టు తెలిపారు. బాధితురాలు, నిందితుడు తండ్రులు రైల్వే శాఖలో ఉద్యోగులని చెప్పారు. రెండు కుటుంబాలు నగరంలోని రైల్వే కాలనీలో పక్కపక్కన ఇండ్లలో ఉంటున్నట్టు తెలిపారు.