Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగుళూరు
రాష్ట్రంలో వైద్య విద్య సంచాలకుల విభాగంలో 274 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఎ వాణీప్రసాద్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 16 నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరిస్తున్నట్టు తెలిపారు. దరఖాస్తుల సమర్పణకు వచ్చేనెల 25వ తేదీ తుది గడువు ఉందని పేర్కొన్నారు.