Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడికి రాలేదన్న కారణంతో టీచర్ నిర్వాకం
భోపాల్ : బడికి రాలేదన్న కారణంతో విద్యార్థుల ముఖానికి టీచర్ మసి పూయించి వీధుల్లో తిప్పాడు. మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లాలో ఈనెల 6న చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. సదరు ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేసినా ప్రిన్సిపాల్ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సింగ్రౌలిలోని ఓబారి ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యా ర్థులు రెండు రోజులు బడికి వెళ్లలేదు. కాగా..స్కూలులో పని చేస్తున్న టీచర్ రామదర్శ ప్రజాపతి... ఈనెల 6న ఐదుగురు విద్యార్థుల ముఖాని కి బొగ్గు మసి పూయించాడు. అనంతరం వీధుల్లో తిప్పాడు. దీనిపై ప్రిన్సి పాల్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో విద్యార్థుల తల్లి దండ్రులు.. జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. విద్యార్థులను కించపరిచిన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అనురాగ్ చౌదరి వెల్లడించారు.