Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శశికళ, దినకరన్లకు ఉద్వాసన
- అన్నాడీఎంకే పార్టీ ఏకగ్రీవ నిర్ణయం
చెన్నై : తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడె క్కాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళను అన్నాడీఎంకే ( అన్నా ద్రవిడ మున్నేత్ర కజ్గమ్) పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ఆ పార్టీ జనరల్ కౌన్సిల్ మంగళవారం సంచలన నిర్ణయం తీసుకున్నది. జయలలిత స్థానంలో పార్టీ జనరల్ సెక్రటరీగా పీఠం దక్కించుకున్న శశికళను ఆ పదవి నుంచి దించేసింది. శశికళతో పాటు ప్రస్తుతం అన్నా డీఎంకే డిప్యూటీ చీఫ్గా కొనసాగుతున్న దినకరన్ను సైతం పార్టీనుంచి బహిష్కరించింది. అంతేగాకుండా, ఆయన పదవీకాలంలో తీసుకున్న నిర్ణయాలన్నీ సర్వ సభ్య సమావేశం రద్దు చేసింది. దీంతో, శశికళ వర్గం అలియాస్ ''మన్నార్గుడి మాఫియా''కి అన్నాడీఎంకే చెక్ పెట్టినట్టు అన్నాడీఎంకే వర్గాలు భావిస్తున్నాయి. ఈ లక్ష్యంతోనే జయలలిత నమ్మినబంటుగా పేరున్న పన్నీర్సెల్వం ప్రస్తుత సీఎం పళనిస్వామితో చేతులు కలిపాక తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి.
కీలక నిర్ణయాలివే...
పళనిస్వామి, పన్నీర్ సెల్వం నేతృత్వంలో సమా వేశమైన అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ ఆరు కీలక తీర్మానాలను ఆమోదించింది. అన్నాడీఎంకే సర్వోన్నత పదవి జనరల్ సెక్రటరీ స్థానాన్ని శాశ్వతంగా జయలలిత పేరు మీదనే ఉంచాలని నిర్ణయించింది. జయలలిత నియమించిన పార్టీ ఆఫీస్ బేరర్లను య థాతథంగా కొనసాగించనున్నట్టు తెలిపిం ది. తాత్కా లిక జనరల్ సెక్రటరీ పదవిని రద్దు చేసింది. దీంతో, ఆస్థానంలో కొనసాగుతున్న శశికళను పక్కనబెట్టినట్ట యింది. టీటీవీ దినకరన్ హయాంలో చేసిన అన్ని తీర్మానాలు, ప్రకటనలను రద్దు చేసింది. వాటికీ, పార్టీ కి ఎలాంటి సంబంధం లేదని తీర్మానంలో స్పష్టం చేసింది. జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడుగా పేరున్న పన్నీర్ సెల్వంకు పార్టీ చీఫ్ కో-ఆర్డినేటర్గా బాధ్యతలు అప్పగించింది. పళనిస్వామికి అసిస్టెంట్ చీఫ్ కోఆర్డినేటర్గా నియమించింది. పార్టీ జనరల్ సెక్రటరీకి ఉండే అధికారాలన్నీ చీఫ్ కోఆర్డినేటర్, అసిస్టెంట్ చీఫ్ కోఆర్డినేటర్లకు అప్పగిస్తున్నట్టు స్పష్టం చేసింది. 'అమ్మ' జయలలిత ఎప్పటికీ పార్టీ జనరల్ సెక్రటరీగా కొనసాగనుండడంతో ఆమె పేరిట ఉన్న అధికారాలు పన్నీర్, పళనిలకు దక్కుతాయని తెలిపింది.