Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్: గుజరాత్లోని నరోదా గామ్లో 2002లో జరిగిన అల్లర్ల కేసు విచారణ చేస్తున్న సిట్ ప్రత్యేక కోర్టు.. బీజేపీ జాతీయ అధ్య క్షుడు అమిత్ షాకు మంగళవారం సమన్లు జారీ చేసింది. కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న గుజరాత్ మాజీ మంత్రి కొద్నాని అభ్యర్థన మేరకు కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. అమిత్షాతో సహా 14 మందిని సాక్షులుగా పరిగణించాలని కోర్టును కొద్నాని అభ్యర్థించారు. కాగా.. ఈనెల 18న అమిత్ షా కోర్టులో హాజరై సాక్ష్యమివ్వాలని న్యాయమూర్తి పిబి దేశారు ఆదేశించారు. ఒకవేళ అమిత్షా.. కోర్టులో హాజరుకాకపోతే రెండోసారి సమన్లు జారీ చేయబోమని కోర్టు స్పష్టం చేసింది. నరోదాగామ్ ఊచకోత ఘటనలో ఓ వర్గానికి చెందిన 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.