Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జవాబుదారీతనం పెరగాలి
- ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : 'ఎంపీలు, ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలను మీడియాలోనూ చూస్తున్నాం. అలాంటప్పుడు వాళ్ల ఆస్తుల వివరాలను సీల్డ్కవర్లో అందజేయాల్సిన అవసరం లేదు. ఎంపీలు, ఎమ్మెల్యేలలో జవాబుదారీతనం పెరగాలి. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ప్రజాప్రతినిధులు లాభాపేక్షే పరమావధిగా వ్యాపారాలు ఎలా చేస్తున్నారు? నేతల అక్రమ ఆదాయ మార్గాలపై విచారణ చేపట్టేందుకు కేంద్రం ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసుకోవాలి. ప్రజాసంక్షేమా న్ని విస్మరించి అక్రమ మార్గాలను అనుసరిస్తున్న నేతల వ్యాజ్యాలను ఫాస్ట్ట్రాక్ కోర్టుల ద్వారా విచారించుకోవాలి' అని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)ను ఉద్దేశించి జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్లతో కూడిన సుప్రీం డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. కొంత మంది నేత ల ఆస్తులు అమాంతం పెరిగాయని లోక్ ప్రహారీ అనే స్వ చ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసింది. 26మంది లోక్సభ ఎంపీలు, 11మంది రాజ్యసభ ఎంపీలు, 257మంది ఎమ్మెల్యేల ఆస్తులు భారీగా పెరిగిన ట్టు ఆసంస్థ తన పిటిషన్లో పేర్కొన్నది. పలువురు అభ్యర్థు లు ఎన్నికల్లో పోటీ చేసే ముందు కేంద్ర ఎన్నికల సంఘం ప్రమాణపత్రంలో పొందుపర్చిన ఆస్తుల వివరాలకు, ప్రస్తుత మున్న ఆస్తుల వివరాల మధ్య భారీ వ్యత్యాసాన్ని గుర్తించిన ట్టు పేర్కొన్నది. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. ఈకేసులో ప్రతివాదిగా ఉన్న సీబీడీటీ కౌంటర్ అఫిడవిట్ను సీల్డ్కవర్లో దాఖలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వోహ్రా కమిటి నివే దికను అటకెక్కించారని కేంద్ర ప్రభుత్వాన్ని చురకలంటిం చింది. లోక్ప్రహారీ స్వచ్ఛంద సంస్థ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేశామనీ, ఏడుగురు లోక్సభ ఎంపీలు, 98మంది ఎమ్మెల్యేల విషయంలో వ్యత్యాసాలు ఉన్నట్టు గుర్తించామని సీబీడీటీ అంగీకరించింది. 42మంది ఎమ్మెల్యేలకు సంబం ధించి ప్రాథమిక అంచనాలు పరిశీలనలో ఉన్నాయనీ తెలి పింది. సీబీడీటీ తరఫున అడ్వకేట్ జనరల్ కెకె వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ప్రజాప్రతినిధుల ఆస్తుల వ్యత్యాసా లకు సంబంధించిన ఫిర్యాదులను సీబీడీటీ పరిష్కరిస్తోం దన్నారు. ఈనేపథ్యంలో ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని వాదనలు వినిపించారు. రాజకీ య నేతల ఆస్తుల పెరుగుదల అంశంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ ఇటీవల జరిగిన విచారణలో సుప్రీంకోర్టు కేంద్రంపై తీవ్రంగా ఆక్షేపించింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీడీటీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీబీడీటీ తాజాగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.