Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్నలిస్టులపై తీర్పులిచ్చే అధికారం శాసన సభ్యులకు లేదు
- వారికి ఉన్న ప్రత్యేక హక్కుల్ని రద్దు చేయాలి(గౌరీ లంకేశ్ స్వయంగా రాసిన ఈ వ్యాసం జూన్ 16, 2017న వచ్చింది. ఆమె హత్య నేపథ్యంలో.. మరోసారి పాఠకుల కోసం..)
శాసనసభ్యులుగా తమకున్న పార్లమెంటరీ హక్కులకు జర్నలిస్టులు భంగం కలిగిస్తున్నారనే ఆరోపణ చాలా కాలంగా కర్నాటకలో వినిపిస్తూనే ఉన్నది. ఇటీవలి కాలంలో రెండు స్థానిక వార పత్రికలకు సంపాదకులుగా ఉన్న రవి బెలగెరె, అనిల్ రాజులపై రాష్ట్ర శాసనసభ స్పీకర్ కత్తి దూసి న విషయం తెలిసిందే. సభాహక్కుల కమిటీ చైర్మెన్ కెబి కోలివాడ్ వీరిద్దరికీ ఏడాది జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధించారు.వారు చేసిన నేరం శాసనసభ్యులకు వ్యతిరేకంగా వ్యాసాలను ప్రచురించడమే. ఈకమిటీ అభిప్రాయం ప్రకా రం శాసనసభ్యులు మచ్చలేని పవిత్రులు. ఆ ప్రత్యేకతకు, హక్కులకు భంగంకలిగించారనేది వారిపై ఆరోపణ.
తమ పత్రికల్లో ఈ ఇద్దరు సంపాదకులు ఏంరాశారన్నది కాదు ఇక్కడ ప్రశ్న. న్యాయనిపుణుల అభిప్రాయం ప్రకారం.. వారు రాసిన వ్యాసాలు పరువునష్టం కలిగించవచ్చు. అంతేకాని అవి ఏవిధంగానూ హక్కులకు భంగం కలిగించేవి కావు. అయితే ఇక్కడ అసలు వివాదం -వలసవాద వారస త్వంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు సంక్రమించిన పార్ల మెంటరీ హక్కులు లేదా ప్రత్యేక అధికారాలు. అరాచకానికి దారి తీయగల ఈచట్టం అడ్డం పెట్టుకొని ప్రజా ప్రతినిధులు తామే జడ్జిలుగా తమను తాము పరిగణించుకుని పాత్రికేయులకు జైలుశిక్ష విధించడం అన్నది ప్రజాస్వామ్యం లో అనుమతించడానికి వీలులేని దుస్సంప్రదాయం.
కర్నాటక రాష్ట్రంలో 1980 వరకు పాత్రికేయ వృత్తి నిలకడగా, హుందాగా కొనసాగింది. పాలకుల గురించిన విమర్శలను సైతం సున్నితమైన సంస్కారవంతమైన పదాలలో వెల్లడించడం ఆనాటి సంప్రదాయం. ఆ తర్వాత లంకేశ్ పత్రిక ఆవిర్భావంతో సంబంధంలోని పదాలు, ధోరణి ప్రబలిపోయి, మాటకు మాట దీటైన పదజాలం వాడుకలోకి వచ్చింది. పత్రిక సంపాదకుడు పి. లంకేశ్ అప్పటి ముఖ్యమబంత్రి ఆర్. గుండూరావును 'గుం' అని, ఆయన సహచర సీనియర్ మంత్రి బంగారప్పను 'బం' అని సంభోదించే వారు. ఆ సమయంలోనే రైతన్నలు రాష్ట్రవ్యాప్తం గా ఉద్యమిస్తున్నారు. దళితులు ప్రాబల్యం సంపాదించుకుం టున్నారు. గోకక్ ఆందోళన విస్తరిస్తున్నది. అంతటా కాంగ్రెస్ పాలనపై అసంతృప్తి రాజుకుంటున్న దశఅది. ఈ సమస్యల న్నింటిపై లంకేశ్ గళం విప్పింది. ముఖ్యమంత్రి గుండూ రావుకు పత్రిక తీరు కోపం తెప్పించింది. ఆయన తన ఆగ్ర హాన్ని 'జర్నలిస్టులందర్నీ తీసుకెళ్లి అరేబియా సముద్రంలో పారవేయాలి' అని వ్యాఖ్యానించడంలో వ్యక్తం చేశారు. అది కూడా ఒక బహిరంగ సభలో.. అశేష జన సమక్షంలో..
నిజానికి ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన రామ కృష్ణ హెగ్దే మరింత కఠినంగా పత్రికల గొంతు నొక్కడానికి ప్రయత్నించారు. అందుకు లెజిస్లేటర్లకున్న ప్రివిలేజెస్ పేరును ఉపయోగించుకున్నారు. సహజంగా ఆయన మిస్టర్ క్లీన్ అనీ, తర్వాతి పీఎం ఆయనే అన్న పేరు జాతీయ మీడి యాలో సంపాదించుకున్న వారే. కానీ, లంకేశ్ పత్రిక రేవ జీతు హౌసింగ్ స్కామ్ను, ఎన్ఆర్ఐహెచ్ఏ భూ కుంభ కోణం, మద్యం షాపుల కేటాయింపు భాగోతాలను బయట పెట్టింది. ఇవన్నీ హెగ్దే నిర్వహణలో ఉండగా జరిగినవే కావడం విశేషం. పత్రికా స్వేచ్ఛకు నియమ నిబందనలను అమలు చేయడం పేరుతో ఆయన కర్నాటక లెజిస్లేచర్ (అధికారాలు, ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్) 1988 బిల్లును హెగ్దే ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో పాత్రికేయులకు కఠినమైన శిక్షలను ప్రతిపాదించడంతో సర్వత్రా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దాంతో రెండు నెలల తర్వాత టెలిఫోన్ టాపింగ్ ఆరోపణలపై హెగ్దే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన అనంతరం పదవి చేపట్టిన ఎస్.ఆర్.బొమ్మరు ఆ బిల్లును బుట్టలో పడేశారు.
అనంతరం మరో జనతాపార్టీ అధినేత జెహెచ్ పాటిల్ హయాంలో మహిళా లెజిస్లేచర్లు తమ విధులను సక్రమం గా నిర్వహించడం లేదని ఆరోపిస్తూ ఒకింత నీచమైన పదజాలంతోనే, ఈ పత్రిక మరో వ్యాసం ప్రచురించింది. సహజంగా వ్యతిరేకత పెద్ద ఎత్తున వచ్చింది. అన్ని పార్టీల వాళ్లూ చేతులు కలిపారు. సభలోనే కన్నీళ్ల పర్యంతమయ్యా రు. పత్రిక నుంచి సంజాయిషీ కోరారు. అప్పటికే పత్రిక తీరు వల్ల ఇబ్బందుల్లో పడిన సీఎం పాటిల్, తదితరులు హక్కులభంగం నోటీసును ప్రతిపాదించారు. ఒకే ఒక్క ఎమ్మె ల్యే ఇండిపెండెంట్ వాటల్ నాగరాజు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఇది పరువునష్టం కలిగించేలా ఉన్న మాట నిజమే కానీ, హక్కులకు భంగం అనటం సరికాదని వాదించారు. నిజానికి ఒకప్పుడు తనకు వ్యతిరేకంగా వ్యాసం రాసిన లంకేశ్పై ఆయన భౌతికంగా దాడి చేసినవాడే. కొద్ది రోజులు వివాదం రేపినా అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్ దానికి మెల్లిగా బుట్టలో పడేశారు. ఈ తీరు ఒక్క లంకేశ్ పత్రిక విషయంలో మాత్రమే కాదు.
ఈ వ్యాస రచయిత గౌరీ లంకేశ్తో పాటు ప్రఖ్యాత జర్నలిస్టు టిజెఎస్ జార్జి లాంటి వారిని కూడా సభా వేదికగా విమర్శలకు గురి చేశారు. మెల్లిగా సంపాదకులను సభ ముందు నిలబెట్టడం సర్వసాధారణంగా మారింది. ఎమ్మెల్యే లను ఏకవచనంతో సంభోదించినా, వారి చర్యలను తప్పు బట్టినా, వారి అధికార దుర్వినియోగం చేసినట్టు ఆరోపిం చినా, అలాంటి అంశాలు సభ ఆగ్రహానికి కారణమయ్యేవి. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల గురించి పల్లెత్తు మాట అన కూడదనేది వారి ఆలోచనాధోరణిగా మారింది. జర్నలిస్టుల పై వచ్చిన చాలా ఆరోపణల విషయంలో మందలించడం లేదా సంజాయిషీ ఇచ్చుకోవడంతో ముగిసిపోయేవి.
బీజేపీకి చెందిన జగదీశ్ షెట్టార్ 2012లో ముఖ్య మంత్రిగా ఉండేవారు. ఆ సమయంలో ఇద్దరు ఎమ్మెల్యేల (అభరుపాటిల్(బీజేపీ), శ్యాం బి ఘటగే(కాంగ్రెస్) ఒత్తిడి కారణంగా ఒక పత్రికా సంపాదకుడు సభకు క్షమార్పణ చెప్పవలసి వచ్చింది. బెలగావి నుంచి వెలువడే తరుణ్ భారత్ అనే మరాఠీ దిన పత్రికలో తమపై నిరాధారమైన ఆరోపణలు చేశారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. స్పీకర్ కెజి బోపయ్య వారి ఫిర్యాదులను హక్కుల కమిటీకి నివేదిం చారు. సంపాదకుడు కిరణ్ ఠాకూర్ను దోషిగా కమిటీ నిర్ణయించింది. ప్రత్యేకంగా అసెంబ్లీలో ఏర్పాటు చేసిన బోనులో నిలబడి ఆయన క్షమార్పణ కోరవల్సి వచ్చింది. ఈ ఘటనపై రాష్ట్రంలోని మీడియా నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం విచిత్రమే.
24 గంటలు నడిచే టీవీ చానెళ్ల సంఖ్య పెరిగే కొద్ది మరింత మురికి బట్టబయలవుతోంది. అర్నబ్ గోస్వామి లాంటి వారి అనుయాయులకు ఇప్పుడు ఏ లోటు లేదు. దూకుడు, వీర దేశ భక్తులు, సంచలనాలకే అధిక ప్రాధాన్యం ఇప్పుడు సర్వసాధారణమైంది. గత మార్చిలో కాంగ్రెస్, బీజేపీ, జనతాదశ్(సెక్యులర్) ఎమ్మెల్యేలు ఏకతాటిపై నిలిచి టీవీ చానెల్స్ తమ గురించి కించపరిచే విధంగా తప్పుడు అంశాలు ప్రచారం చేస్తున్నట్టు ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ గౌడ టోల్ బూత్ సిబ్బందిపై దాడి చేయడం సీసీటీవీ కెమెరా సాక్షిగా నిర్ధారణ అయ్యింది. ఒక టీవీ చానెల్ ఈ ఘటనను ప్రసారం చేస్తూ తన గురించి రౌడీ సురేశ్ గౌడ అని వ్యాఖ్యానించిందని ఆరోపించారు.
ఇప్పుడున్న స్పీకర్ కోలివాడ్ ఘనంగా ప్రకటిస్తున్నారు. -అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో కూడిన సభాసంఘం తర్వలో మీడియాకు సంబంధించిన విధి విధానాలను నిర్ణయిస్తుం దని. విచిత్రం ఏమిటంటే పత్రికలపై కట్టడి అవసరం అని డిమాండ్ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు ఆ కమిటీలో సభ్యత్వం తీసుకునేందుకు మాత్రం నిరాకరించడమే. వాళ్లు అందుకు చెప్పిన కారణం.. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు తమ అభిమతం కాదని చెప్పుకున్నారు. సర్వత్రా ఎదురైన విమర్శల కారణంగా ప్రస్తుతం ఆ ప్రతిపాదన అటకెక్కినట్టయింది.