Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్లకార్డులతో భారీ నిరసన ర్యాలీ
- సీతారాం ఏచూరి, సాయినాథ్, మేథాపాట్కర్, తదితరులు హాజరు
'నేనూ గౌరీ లంకేశ్ను..' అంటూ బెంగళూరు పురవీధులు మారుమోగాయి. ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్యకు నిరసనగా కర్నాటక రాజధాని బెంగళూరు నగరంలో మంగళవారం భారీ నిరసన ర్యాలీ జరిగింది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులు, వివిధ ప్రజా సంఘాల కార్యకర్తలు, పలు రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలతో బెంగుళూరు వీధులు జనసంద్రంగా మారాయి. గత వారం జరిగిన ఆమె హత్యను ముక్తకంఠంతో ఖండించారు. సిటీ రైల్వే స్టేషన్ నుంచి సెంట్రల్ కాలేజి గ్రౌండ్స్ వరకూ ఈ ర్యాలీ నిర్వహించారు.
బెంగళూరు : 'నేనూ గౌరీ లంకేశ్ను..' అంటూ బెంగళూరు పురవీధులు హోరెత్తాయి. ప్రముఖ పాత్రికే యురాలు హత్యకు నిరసనగా కర్నాటక రాజధాని బెంగ ళూరు నగరంలో మంగళవారం భారీ నిరసన ర్యాలీ జరిగింది. సీపీఐ(ఎం) సభ్యులు, కర్నాటక జనశక్తి, ఆమ్ ఆద్మీ పార్టీ, పలు విద్యార్థి సంఘాలు కూడా ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నాయి. ఈ నెల 5న గుర్తుతెలియని వ్యక్తులు గౌరీ లంకేశ్ను వెంబడించి ఆమె నివాసం వద్ద అతి సమీపం నుంచి కాల్పులు జరిపి హత్య చేసిన విషయంం తెలిసిందే. 'గౌరీ లంకేశ్ అమర్ రహే, లాంగ్ లివ్ గౌరీ లంకేశ్, నిందితు లను వెంటనే అరెస్టు చేయాలి' అంటూ ర్యాలీ పొడవునా ప్రదర్శనకారులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. 'ఐ యామ్ గౌరీ' అని రాసివున్న నల్ల రిబ్బన్లను తలకు కట్టుకొని ర్యాలీలో పాల్గొనడం విశేషం. సెంట్రల్ కాలేజి గ్రౌండ్స్ వద్ద జరిగిన బహిరంగ సభలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రముఖ పాత్రికేయులు పాలగుమ్మి సాయినాథ్, సామాజిక కార్యకర్త మేథాపాట్కర్, సాగరికా గోష్, స్వరాజ్ ఇండియా నాయకులు ప్రశాంత్ భూషణ్, యేగేంద్ర యాదవ్, డాక్యుమెంటరీ ప్రొడ్యూసర్ ఆనంద్ పట్వర్ధన్, రాకేశ్ శర్మ, పౌర హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్, కవితా కృష్ణణ్, దళిత నేత జిగేశ్ మెవాని, సినీ నిర్మాత ప్రకాశ్ రారు తదితరులు ప్రసంగించారు. ప్రగతిశీల ఫోరమ్ 'గౌరీ లంకేశ్ హత్య విరోధి వేదిక' ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. లంకేశ్ హత్యకు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రగతిశీలకులు, రచయితలు, సామాజిక కార్యర్తలు, కళాకారులు, మేధావులతో కలిసి ఈ వేదిక గత శుక్రవారం ఏర్పడింది.
మీరంతా నా గౌరీలే.. : లంకేశ తల్లి
'తన చివరి రక్తపు బొట్టు వరకూ గౌరీ పోరాడింది. ఆమె హత్యను నిరసిస్తూ ఇంతమంది ముందుకొచ్చారు. మీరంతా నా గౌరీలే..' అంటూ గౌరీ తల్లి ఇందిరా లంకేశ్ భావోద్వేగానికి గురయ్యారు.
భిన్నాభిప్రాయాలను వ్యక్తపరిచినందుకు చంపేశారు : ఏచూరి
భారతీయ ప్రజాస్వామ్యానికి, బహుళత్వానికి ఒక సైనికుడిలా నేనిక్కడ ఉన్నాను. ఇది ఒక ఊహ కాదు. ఇది వాస్తవమైనది, సజీవమైనది. హింసారహితంగా, చర్చలకు, అభిప్రాయాలు వెల్లడికి అవకాశం ఉంటేనే.. భిన్నత్వంలో ఏకత్వం, సహజీవనం సాధ్యం. సంఘర్షిస్తూ కలిసి ఉండేదే భారతదేశం. బుల్లెట్ల ద్వారా హత్యలకు పాల్పడుతూ ఉంటే.. ఆ భారతదేశం మిగలదు అని సీతారాం ఏచూరి అన్నారు. 'భిన్నాభిప్రాయాలను వ్యక్తపరిచిన వ్యక్తిని దేశం కోల్పోయిం ది. ఇది ఆమోదయోగ్యం కాదు.
నిరంకుశ రాజ్యాన్ని సృష్టిస్తు న్న వారికి వ్యతిరేకంగా ఒక ఉద్యమమార్గంలో మనం ఇక్కడ ఉన్నాం. ఇదే భారతదేశ వైరుధ్యం' అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ కేసులు నమోదుచేయడాన్ని ప్రస్తావిస్తూ.. అలాంటి వాటికి ఎవరూ భయపడరని చెప్పారు. 'గుర్తుంచుకోండి. భిన్నత్వానికి వ్యతిరేకులు, హిందూ రాష్ట్రవాదానికి మహాత్మా గాంధీ సైతం బాధితుడయ్యాడు' అని ఏచూరీ తెలిపారు.
గౌరీ లాంటి వారి వల్లే ప్రజాస్వామ్యం ఇంకా ఉంది.. : మేథాపాట్కర్
గౌరీ లాంటి వారి వల్లే ప్రజాస్వామ్యం ఇంకా మనుగలుగుతోందని నర్మదా బజాబో ఆందోళన్ నేత మేధాపాట్కర్ అన్నారు. పెన్నునే ఆయుధంగా మలిచి ఆమె పోరాడారని కొనియాడారు. ఆశావాదం వల్లే ఇన్ని గొంతుకలు ఒకే మేదిక మీదకు వచ్చాయన్నారు. రాజ్యాంగాన్నే కాదు.. సమానత్వం యొక్క ఆకాంక్షలను కూడా వారు ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. దబోల్కర్ లాంటి నేతలను హత్య చేసిన సనాతన సంస్థ లాంటి సంఘాలు గోవాలాంటి చోట్ల ఇంకా ఉండటంపట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గౌరిని హత్య చేసిన హంతకులకు శిక్షపడే దాకా పోరాటం ఆగదని, న్యాయం జరిగేవరకూ అందరం కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు.
ఫైర్ బ్రాండ్ రైటర్ : తీస్తా సెతల్వాద్
'గౌరిని చూసి నేను చాలా నేర్చుకున్నాను. గౌరి పట్ల యావత్ జాతి కదిలి రావడం నన్ను ఆశ్చర్యపరుస్తోంది. స్థానిక భాషలో ఆమె ఫైర్ బ్రాండ్ రైటర్. మేమిద్దరం చాలాచోట్లకి కలిసి ప్రయాణించాం. ఆమె హేతువాద ధోరణి కులం పట్ల ప్రశ్నించేలా చేసింది.