Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్చలు విఫలంతో ఏఐకేఎస్ ఆధ్వర్యంలో రోడ్డెక్కిన అన్నదాతలు
సికార్ (రాజస్థాన్): రుణమాఫీ, స్వామినాథన్ సిఫార్సులనుఅమలు చేయాలని డిమాండ్చేస్తూ రాజస్థాన్లో గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆందోళన చేస్తున్న అన్నదాతల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రభుత్వం మంగళవారం జరిపిన చర్చలు విఫలం కావడంతో రైతులు బుధవారం పెద్దఎత్తున నిరసనలకు దిగారు. ఆందోళనలకు కేంద్రబిందువుగా ఉన్న సికార్ రీజియన్లోని జాతీయ రహదారులపై బైఠాయించారు. దీంతో సాధారణ జనజీవనం స్థంభించిపోయింది. రుణమాఫీ చేయాలని, నష్టపోయిన తమ పంటకు పరిహారం ఇవ్వాలని రైతులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనలు ఉధృతంగా సాగుతున్న సికార్లో తీవ్ర కరువుపరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ రీజియన్లోని 250 ప్రాంతాల్లో జాతీయ రహదారులపై రైతులు బైఠాయించారు. జైపూర్ - సికార్ రోడ్డు, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్పై వేలాదిమంది రైతులు నిరసన వ్యక్తం చేశారు. జైపూర్ నుంచి జుంజుహును, చురు, బికనీర్కు వెళ్ళే మార్గాలను దిగ్బంధం చేశారు. సికార్ జిల్లా కలెక్టరేట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 144వ సెక్షన్ విధించారు. జిల్లా అంతటా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. 'రుణ మాఫీ, స్వామినాథన్ సిఫారసుల అమలు కు ప్రభుత్వం ఒప్పుకునేవరకూ.. తమ ఆందోళన విరమించేదిలేదు, దిగ్బంధనాలు ఇలాగే కొనసాగుతాయి' అని ఏఐకేఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే అమ్రారామ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.