Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండీగఢ్: ఇద్దరు మహిళలపై లైంగికదాడి కేసులో డేరా చీఫ్ గుర్మీత్.. జైలుకు వెళ్లినప్పటి నుంచి అతడి అనుచరుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కంప్యూటర్లను ట్యాంపరింగ్ చేశాడన్న కారణంతో డేరా ఐటీ హెడ్ వినీత్ కుమార్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. సిర్సాలోని డేరా హెడ్క్వార్టర్స్లో పోలీసులు ఇటీవల సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సోదాలకు ముందు ప్రధాన కార్యాలయంలోని కంప్యూటర్లను ట్యాంపరింగ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అక్రమాలకు సంబంధించిన ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు వినీత్.. కంప్యూటర్ హార్డ్ డిస్క్లను మార్చినట్టు ఆరోపణలున్నాయి. అయితే ఈ క్రమంలోనే వినీత్కు పోలీసులు ఇటీవల సమన్లు జారీ చేశారు. కాగా మంగళవారం పోలీసుల ఎదుట హాజరైన వినీత్.. డేరా కంప్యూటర్ సెల్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేశాడు. దీంతో అతడిని అరెస్టు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.