Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టాప్ పోస్టులు కైవసం.. ఏబీవీపీకి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ప్రఖ్యాత ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్(డీయూఎస్యూ) ఎన్నిక ల్లో కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం నేషనల్ స్డూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) సత్తా చాటింది. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను సొంతం చేసుకున్నది. ఈ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)కి భంగపాటు ఎదురైంది. వర్సిటీలో ఏబీవీపీ సాగిస్తున్న ఆధిపత్యానికి ఎన్ఎస్యూఐ చెక్ పెట్టింది. ఏబీవీపీ.. కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులతో సరిపెట్టుకున్నది. బుధవారం విడుదలైన ఫలితాల్లో తొలుత ఎన్ఎస్యూఐ మూడు పోస్టుల్లో విజయం సాధించింది. కానీ, రీకౌంటింగ్లో ఒక పోస్టును కోల్పోగా, దానిని ఏబీవీపీ గెలుచుకున్నది. డీయూఎస్యూ అధ్యక్షుడిగా ఎన్ఎస్యూఐ అభ్యర్థి రాకీ టసీర్.. ఏబీవీపీ అభ్యర్థిపై 175 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ సందర్భంగా రాకీ తన అనుచరులతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని బుధవారం సాయంత్రం కలుసుకున్నారు. ఇటీవల జరిగిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్(జేఎన్యూఎస్యూ) ఎన్నికల్లో ఎన్ఎస్యూఐ దారుణ ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. ఎన్ఎస్యూఐ కంటే నోటాకే ఎక్కువ ఓట్లు పడడం గమనార్హం. ఈ ఎన్నికల్లో నాలుగు పోస్టులనూ లెఫ్ట్ కూటమి కైవసం చేసుకున్నది.