Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరద బాధితులకు కాలం చెల్లిన ఉత్పత్తుల అందజేత
గువహతి: సాయమంటేనే మానవతా దృక్పథంతో చేసేది. దానిలో కూడా అక్రమాలకు పాల్పడితే వారికి దానగుణం ఏపాటి ఉన్నట్టు? అస్సాంలో వరద బాధితులకు గడువు ముగిసిన ఉత్పత్తులను అందించి రాందేవ్ బాబా పతంజలి మరోసారి వివాదంలోకెక్కింది. ఈ విషయమై దర్యాప్తు జరిపి, తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. కొద్ది రోజుల నుంచి అసోంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా 75 మంది చనిపోగా, 71 వేల మంది నిరాశ్రయులయ్యారు. అయితే.. వరద బాధితులకు పతంజలి ఉత్పత్తులైన పాల పొడి ప్యాకెట్లు, జ్యూస్ను ఉచితంగా అందించే కార్యక్రమం చేపట్టారు. కానీ, మజూలి జిల్లాలో చాలా మందికి గడువు ముగిసిన ఉత్పత్తులను అందించినట్టు తెలిసింది. అంతేకాదు.. వీటిని తీసుకున్న వారిలో కొందరు అస్వస్థతకు గురైనట్టు సమాచారం. పతంజలి ఉత్పత్తుల్లో నాణ్యతా ప్రమాణాలు లేవని పలు పరిశోధనల్లో ఇదివరకే వెల్లడైన సంగతి తెలిసిందే.