Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాఠశాలల్లో అటెండెన్స్ పలకడంపైనా ఆంక్షలు..
- మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి వివాదాస్పద నిర్ణయం
భోపాల్ : పాఠశాలల్లో విద్యార్థుల హాజరు తీసుకు నేటప్పుడు... పిల్లలు ఎస్ సార్ అనో, ఎస్ మేడమనో.. ప్రజెంట్ సార్.. అనో చెబుతుండటం మనకు తెలిసిందే. కాగా ఇప్పుడు హాజరు ఎలా పలకాలో కూడా శాసిస్తున్నాయి బీజేపీ ప్రభుత్వాలు. విద్యార్థులు ఇక నుంచి హాజరు పలికే టప్పుడు తప్పనిసరిగా జైహింద్ అని మాత్రమే అనాలంటూ మధ్యప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం విద్యార్థులకు హుకుం జారీ చేసింది. మొదటి దశలో భాగంగా సత్నా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని విద్యాశాఖ మంత్రి విజరుషా నిర్ణయించారు. అక్టోబర్ 1 నుంచి దీనిని అమలు చేస్తామని విజరు షా ప్రకటించారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. సత్నాజిల్లాలో కనుక ఇది విజయవంతమైతే.. మధ్యప్రదేశ్ రాష్ట్రమంతా తప్పనిసరిగా అమలు చేస్తామ ని తెలిపారు. కాగా, ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. 'జై హింద్ అనేది ఒక నినాదం. పాఠశాలల్లో ఉదయం జరిగే అసెంబ్లీలో జాతీయ గీత అలాపన పూర్తయిన తర్వాత ప్రతి విద్యార్థి ఈ నినాదాన్ని చేస్తాడు. స్వాతంత్రోద్యమ పోరాటంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన నేతలను అవమానించేలా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలున్నాయి' అని కాంగ్రెస్ మధ్యప్రదేశ్ అధికార ప్రతినిధి కెకె మిశ్రా విమర్శించారు.