Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. లక్ష వరకూ రద్దు చేస్తామన్నారు..
- చేసింది ఒక్క రూపాయి నుంచి రూ. 500లే..
- రైతులకు యోగి సర్కార్ షాక్
- అన్నదాతను అవమానిస్తున్నారు : సమాజ్వాదీ పార్టీ
లక్నో : 'మాకు ఓట్లేయండి... మీ రుణాలు మాఫీ చేస్తాం...' అంటూ ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అగ్రనేతలు సహా అందరూ ఊదరగొట్టారు. ఎన్నికలు పూర్తయ్యా యి. అధికారంలో వచ్చాక యోగి ప్రభుత్వం రైతు రుణాలను మాఫీ చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇంత వరకూ అంతా బాగానే ఉంది. మరి వచ్చిన చిక్కేంటంటే.. వారికి మాఫీ చేసిన రుణాన్ని చూసి.. రైతులు షాక్కు గురవుతున్నారు. ఒక్కో రైతుకూ ఒక్క రూపాయి నుంచి రూ.500 వరకూ మాఫీ అయ్యిం ది. రూ.ఒకటి నుంచి రూ.500ల వరకూ రుణమాఫీ పొందిన రైతులు మొత్తం 11,700 మంది ఉన్నారు. మొత్తం 11.93 లక్షల మందికి మొదటి విడతగా రుణమాఫీ పథకాన్ని అమలుచేసి ఇందుకోసం రూ. 7,371 కోట్లు కేటాయించారు. ఇందులో రూ. 1 నుంచి 100 రూపాలు రుణమాఫీ అయిన వారు 4,814 మంది రైతులున్నారు. ఇవన్నీ అధికారికంగా ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన లెక్కలు. ఈ రుణ మాఫీ సర్టిఫికెట్లు చూసి రైతులు విస్తుపోతు న్నారు. రైతుల రుణ మాఫీ పేరుతో హమీర్పుర్ గ్రామంలో అట్టహాసంగా నిర్వహించిన ఓ కార్యక్ర మంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మన్ను కోరి పాల్గొ న్నారు. ఈ కార్యక్రమంలో రైతులకు 'మాఫీ' సర్టిఫికెట్లను అందచేశారు.
రూ. 1.55 లక్షలు రుణం ఉంటే...
ఉమ్రి గ్రామానికి చెందిన శాంతి దేవికి రూ. 1.55 లక్షల రుణం ఉంది. ఆమెకు కేవలం పది రూపాయల 37 పైసల రుణాన్ని రద్దుచేస్తున్నట్టు సర్టి ఫికెట్ ఇచ్చారు. మౌదాహా గ్రామానికి చెందిన మున్ని లాల్కు రూ.40 వేల రుణం ఉంటే.. రూ. 215 రద్దు చేస్తున్నట్టు సర్టిఫికెట్ చేతిలో పెట్టారు. రూ.లక్ష వర కూ రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభు త్వం ఇప్పుడు పదులు, వందల్లో రద్దు చేస్తున్నట్టు సర్టిఫికెట్లు ఇస్తుంటే అవి చూసి రైతులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏలెక్కన ఈమాఫీ చేశారో చెప్పాలం టూ ప్రశ్నిస్తున్నారు. 'కృషి రిన్ మోచన్ యోజన (రైతు రుణమాఫీ పథకం)ను యోగి ప్రభుత్వం గత నెలలో ప్రారంభించింది. రూ.లక్ష పరిమితి విధిస్తున్న ట్టు తెలిపింది. 87 లక్షల మంది రైతులకు ఈ పథకం లబ్దిచేకూరుతుందని తెలిపింది. ఇందుకు ప్రభుత్వ ఖజానాకు రూ.36వేల కోట్లు ఖర్చుకానున్నట్టు కూడా అట్టహాస ప్రకటన చేసింది. కాగా, ఈ రుణమాఫీపై విమర్శలు రావడంతో దీనిపై తాను సమగ్ర పరిశీలన చేస్తానని మంత్రి సర్దిచెప్పుకొచ్చారు. 'నిబంధనల ప్రకారం రుణమాఫీ ఇచ్చాం. వత్యాసాలేమైనా ఉంటే.. దానిపై దర్యాప్తు నిర్వహిస్తాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం' అని మన్ను కోరి చెప్పారు. కాగా, దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రుణమాఫీ పేరుతో రైతులను అవమానించినట్లేనని, వారిని వంచిస్తున్నారని సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నరేశ్ ఉత్తం విమర్శించారు. ఇది ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయమని ఆరోపించారు.