Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరిగిన పెట్రోల్ ధరలపై కేంద్రమంత్రి కెజె ఆల్ఫోన్స్
న్యూఢిల్లీ:వాహన సొంతదారులెవరూ ఆకలితో బాధపడేవారు కాదని కేంద్ర పర్యాటక శాఖమంత్రి కేజే ఆల్ఫోన్స్ అన్నారు. ఇటీవల డీజిల్, పెట్రోల్ ధరలు మూడేండ్ల గరిష్టానికి చేరుకున్న అంశంపై కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ఎవరు కొంటారు..? కారు లేదా బైక్ ఉన్నవారే కదా..వారెవరూ ఆకలితో బాధపడే వారు కాదని కెజె ఆల్ఫోన్స్ అన్నారు. తమ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఎంతో డబ్బు ఖర్చు చేస్తున్నది, ఆ డబ్బంతా పన్ను చెల్లించ గలిగి నవారి నుంచి వసూలు చేయక తప్పదని ఆల్ఫోన్స్ అన్నారు. ప్రతి గ్రామాన్నీ విద్యుదీక రిస్తామని, ఇండ్ల నిర్మాణం చేపడ్తామని, ప్రతి ఇంట్లో టాయిలెట్ నిర్మిస్తామని తమ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత డీజిల్పై లీటర్కు 44.6 శాతం, పెట్రోల్పై 51.6 శాతం పన్నులు విధిస్తున్నారు. దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వం సమాధానాల కోసం వెతుక్కుం టున్న ది. పెరుగుతున్న పెట్రోల్ ధరల విషయంలో ఏం చేయలేమని కేంద్ర పెట్రో లియం శాఖ మంత్రి ధర్మేంధ్రప్రధాన్ అనటం గమనార్హం.