Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిల భారత బీడీ కార్మికుల సమాఖ్య (సీిఐటీియూ) డిమాండ్
- 7వ మహాసభలో పలు తీర్మానాలు ఆమోదం
చిత్తూరు : బీడీ కార్మికులకు రూ.350 కనీస వేతనంగా నిర్ణయించాలని తమిళనాడులోని వేలూరులో నిర్వహించిన సీఐటీయూ అనుబంధ అఖిల భారత బీడీ కార్మికుల సమాఖ్య 7వ మహాసభ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈనెల 14, 15, 16వ తేదీల్లో వేలూరులో జరిగిన మహాసభలను సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు ఎకె.పద్మనాభన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాసభ పలు తీర్మానాలను ఆమోదించింది. చివరి రోజు శనివారం జరిగిన సభలో పద్మనాభన్ మాట్లాడుతూ.. బీడీ కార్మికులు తమ న్యాయమైన కోర్కెలను అంగీకరించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. జులై ఒకటి నుండి దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వస్తుసేవా పన్ను (జీఎస్టీ) బీడీలపై 28 శాతం విధించడం వల్ల బీడీ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బీడీ పరిశ్రమలలోని అన్ని కార్మిక సంఘాలన్నీ కలిసి పోరాటాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. నవంబర్ 9, 10, 11వ తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరగనున్న మహాధర్నాలో వేలాది మంది బీడీ కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అఖిల భారత బీడీ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి దేబసిస్రారు మాట్లాడుతూ.. బీడీ కార్మికుల 12 కోర్కెలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదన్నారు. మహాసభకు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, కర్ణాటక, బీహార్, తెలంగాణ, ఆంధ్ర, త్రిపుర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.
జాతీయ అధ్యక్షులుగా సహదేవన్
ప్రధాన కార్యదర్శిగా దేబసిస్రారు ఎన్నిక
వేలూరులో జరిగిన మహాసభలో 3వ రోజు జాతీయ అధ్యక్షులుగా కెేపీ సహదేవన్ (కేరళ), ప్రధాన కార్యదర్శిగా దేబసిస్ రారు(పశ్చిమ బెంగాల్) ఎన్నికయారు. వీరితోపాటు 9 మంది ఉపాధ్యక్షులు, 9 మంది కార్యదర్శులు, వర్కింగ్ కమిటీ సభ్యులుగా 47 మంది, కోశాధికారిగా బియన్సన్సాల్ (పశ్చిమబెంగాల్)ను మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అలాగే ఆంధ్రప్రదేశ్కు చెందిన పి.చైతన్య అఖిల భారత బీడీ వర్కర్స్ ఫెడరేషన్ వర్కింగ్ కమిటీ సభ్యునిగా, ఆంధ్రప్రదేశ్ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్గా ఎన్నికయ్యారు.
మహాసభ ఆమోదించిన తీర్మానాలు
- వెయ్యి బీడీలు చుట్టేందుకు రూ.350 జాతీయ కనీస వేతనంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలి.
- పెరిగే నిత్యావసరస వస్తువుల ధరలకు అనుగుణంగా కరువు భత్యాన్ని పెరిగిన ప్రతి పాయింటుకూ ఐదు పైసలు చెల్లించాలి.
- బీడీలపై విధించిన 28 శాతం వస్తుసేవా పన్నును ఉపసంహరించుకోవాలి.
- వెయ్యి బీడీలు చుట్టేందుకు అవసరమైనంత నాణ్యమైన ఆకును బీడీ ఫ్యాక్టరీల యజమానులు ఇవ్వాలి. కార్మికులు చుట్టిన బీడీలు తక్కువ వచ్చాయనే పేరుతో వేతనంలో కోత విధించరాదు.
- వారానికి ఆరు రోజులు పని ఇవ్వాలి, పని ఇవ్వని రోజున కార్మికునికి 50 శాతం వేతనం యజమానులు చెల్లించాలి.
- బీడీ పరిశ్రమలో అమలవుతున్న కాంట్రాక్టు, సబ్ కాంట్రాక్టు పద్ధతిని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలి.
- యాజమానుల పేరు మీదనే ప్రావిడెంట్ ఫండ్ కోడ్ నంబర్లు ఇవ్వాలి. కాంట్రాక్టర్ పేరు మీద ఇవ్వకూడదు.
- కార్మికులందరికీ ఫోటో అతికించిన గుర్తింపు కార్డులు యాజమానులు ఇవ్వాలి.
- కార్మికుల చట్టాలను అమలు చేయాలి.
- కార్మికులకు సంవ్సతరానికి ఒకసారి 8.33 శాతం బోనస్ యాజమానులే ఇవ్వాలి. తదితర డిమాండ్లను అంగీకరించాలి.
- తమ కోర్కెలను తీర్చాలని పది లక్షల మంది బీడీ కార్మికుల సంతకాలతో ప్రధానమంత్రికి వినతి పత్రం ఇవ్వాలి.