Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూరాల వద్ద పర్యాటకుల తాకిడి
విజయనగరం : శ్రీశైలంలోకి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. జూరాల, తుంగభద్ర నుంచి 1,35,000 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలంలోకి వస్తోంది. జూరాల వద్ద పర్యాటకుల తాకిడి పెరిగింది. తుంగభద్ర నుంచి 17,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా జూరాల నుంచి 1,18,000 క్యూసెక్కులు వస్తోంది. శ్రీశైలం నీటి నిలువ సామర్థ్యం 885 అడుగులకు గాను శనివారం 844 అడుగులు ఉండేది. ఆదివారం 848.9 అడుగులకు చేరింది. 215 టిఎంసిలకు గాను ప్రస్తుతం 77.69 టిఎంసిలు వుంది. కృష్ణా నది ఎగువన కూడా వరద కొనసాగుతూనే ఉంది. అల్మట్టిలోకి 33,400 క్యూసెక్కులు వస్తుండగా వచ్చిన నీటిని దిగువకు వదులుతున్నారు. ఆల్మట్టికి దిగువన ఉన్న నారాయణ్పూర్లోకి 47,266 క్యూసెక్కుల వస్తుండగా 44,386 క్యూసెక్కులను వదులుతున్నారు. జూరాలలోకి 1,13,326 క్యూసెక్కులు వస్తుండగా 1,18,000 క్యూసె క్కులను శ్రీశైలం వైపు వదులుతున్నారు. జూరాల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతుండటంతో ఆ దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు భారీ ఎత్తున వచ్చారు.
నాగావళికి స్వల్ప వరద
విజయనగరం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నాగావళి నదిలోకి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. తోటపల్లి రిజర్వాయర్లోకి 3,870 క్యూసెక్సుల నీరు వచ్చి చేరుతుండటంతో గేట్లను ఎత్తివేసి 1,870 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కాలువల ద్వారా 1,420 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు.